పెళ్లి అనేది ప్రతి కుటుంబంలో మరపురాని వేడుక. అలాంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్రతి కుటుంబ సభ్యులు కోరుకుంటారు. అయితే ఓ పెళ్లి వేడుకలోని విందు.. 400 మందిని ఆస్పత్రి పాలు చేసింది.
సరదాగా తిన్న చాట్ మసాలా 80 మందిని ఆస్పత్రి పాలు చేసింది. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. ఒక్కసారిగా ఇంత మంది రోగులు ఆస్పత్రికి రావడంతో బెడ్ల కొరత, వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది.
హోటళ్లలో బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే మెదక్ లోని ఓ మండి హోటల్లో మటన్ బిర్యానీ తిని పలువురు ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్లో అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది.
మండి బిర్యానీ కల్చర్ ఈమధ్య బాగా పెరిగింది. సిటీ నుంచి విలేజ్ వరకూ మండి సెంటర్లు విస్తరిచాయి. అయితే అలాంటి ఓ మండి సెంటర్లో బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం ఏంటంటే..!
ఆనందనగా స్నాక్స్ ఆరగించడమే ఆ విద్యార్థినుల పాలిట శాపమైంది. తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలతో కొందరు.. కడుపు నొప్పితో మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
చికెన్ కబాబ్ కదా అని ఇష్టంగా తిన్న విద్యార్థినులకు అది తీవ్ర విషాదాన్ని నింపింది. వాంతులు, విరేచనాలతో వందకుపైగా విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని, మంగళూరు పరిధిలో ఉన్న సిటీ నర్సింగ్ హాస్టల్లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హాస్టల్లో విద్యార్థినులందరికీ ఘీ రైస్, చికెన్ కబాబ్ వడ్డించారు. హాస్టల్లో 400కు పైగా విద్యార్థినులు ఉండగా, నాన్- వెజ్ తినని వారు మినహా మిగిలిన అందరూ చికెన్ కబాబ్ తిన్నారు. తిన్న కాసేపటికే ఒక విద్యార్థినికి […]
నిర్మల్ జిల్లా జిల్లా బాసర ట్రిపుల్ఐటీలో ఫుడ్ ఫాయిజన్ కలకలం రేపింది. సుమారు 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఓల్డ్ మెస్ లో మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటికే సుమారు 600 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ట్రిపుల్ఐటీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీరియస్ గా ఉన్న విద్యార్థులను నిజమాబాద్ కు తరలిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి ఎగ్ ఫ్రైడ్ రైస్ కారణమని […]
ఫుడ్ సెంటర్ నిర్లక్ష్యంగా కారణంగా ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ షాక్ కి గురిచేసింది. షవర్మా తినడం వల్ల ఈ 16 ఏళ్ల యువతి తోపాటు మరో 15 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన కేరళోని కాసరగాడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని చెరవథూర్ ఏరియాలో దేవానంద అనే 16 ఏళ్ల యువతి ఉంటోంది. నిత్యం స్టడీలో భాగంగా దగ్గర్లోని ట్యూషన్ […]
పాఠశాలకు వచ్చే విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తోంది. అయితే నిర్వాహణ లోపంతో కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్యాహ్న భోజనం చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఈ తరహా సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నంద్యాల పట్టణం విశ్వనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 42 […]
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా జనాలు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇక పెళ్లి వేడుకలయితే.. పూర్తిగా బోసిపోయానని చెప్పవచ్చు. చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో పెళ్లి వేడుకలు జరిగాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గడంతో.. జనాలు మాస్క్ తీసి కాస్తా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వివాహాది శుభకార్యలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ నేత ఇంట పెళ్లికి భారీగా హాజరయ్యారు జనాలు. అయితే దురదృష్టం కొద్ది విందు భోజనం తిన్న వారిలో కొందరు […]