నేటికాలంలో కొందరి యువత ఆలోచనలు విచిత్రంగా ఉంటున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్ధంలో పెట్టి చూసి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిందండ్రులు డ్రెస్స్ కొన్నివ్వలేదని, ప్రేమించిన యువకుడు మోసం చేశాడని, కావాల్సిన వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బాధపడుతూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ యువతి.. తాను అందంగా లేనని, ముఖంపై మచ్చలు ఉన్నాయని తనలో తాను కుమిళిపోయి… చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర ప్రదేశ్ లో బిసంద పోలీస్ స్టేషన్ పరిధిలోని అజిత్ పారా గ్రామంలో ఓయువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గత కొంతకాలంగా నుంచి ఆ యువతి ముఖంపై పింపుల్స్ వస్తున్నాయి. చూడటానికి తన ముఖం అందవిహీనంగా ఉందని తనలో తాను బాధపడేది. ఈక్రమంలో ఎన్ని చికిత్సలు చేయించున్న అవి తగ్గలేదు. దీంతో పింపుల్స కారణంగా నల్లటి మచ్చలు సైతం ఏర్పడ్డాయి. దీంతో ఆమెతో ఎవరు స్నేహం చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదని సమాచారం. ఈ క్రమంలోనే ఆమె అందంగా లేదని పెళ్లి చూపులకు వచ్చిన వారు ఆమెను నిరాకరించారు.
ఇదీ చదవండి: కామాంధుడిగా మారిన ర్యాపిడో డ్రైవర్.. కాలేజీ అమ్మాయిలే వీడి టార్గెట్!
దీంతో ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. సోమవారం తన ఇంట్లో పశువులకు దానా పెట్టి అనంతరం ఆమె తన గదిలోకి వెళ్లింది. ఇంటిలో ఎవరు లేనిది చూసి ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తరువాత గమనించి కుటుంబ సభ్యులు డోర్ కొట్టారు. తలుపు బద్దలు కొట్టి లోపలి వెళ్లి చూడాగా ఆమె ఉరికి వేలాడుతూ విగత జీవిగా కన్పించింది. వెంటనే డోర్ పగలగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.