ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అయితే కొందరి జీవితంలోమాత్రం సుఖాల కంటే కష్టాల్లే ఎక్కువగా ఉంటాయి. అలా ఎదురయ్యే కష్టాలను కొందరు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొందరు మాత్రం తీవ్ర మనస్తాపం చెంది.. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ అలాంటి నిర్ణయమే ఒకటి తీసుకుంది. మూడేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అతడి జ్ఞాపకాలు మరవలేక, ఇతర సమస్యలకు తట్టుకోలేక అభంశుభం తెలియని తన పిల్లలను నీటిలో ముంచి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన బాసర లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ కి చెందిన మానస(27కి మహబూబ్ నగర్ జిల్లా కోస్గికి చెందిన వెంకటేశ్వర్లతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి బాలాదిత్య(8), భవ్యశ్రీ(7) అనే పిల్లల ఉన్నారు. అయితే అనారోగ్యంతో కారణంగా మూడేళ్ల క్రితం వెంకటేశ్వర్ల మరణించాడు. దీంతో కొన్నేళ్ల నుంచి నిజామాబాద్ లోని తన అన్న ఉండే ప్రాంతంలో మానస నివాసం ఉంటుంది. మానస అన్న సందీప్ కి కూడా పిల్లలు లేకపోవడంతో .. చెల్లెల్లి పిల్లను ప్రేమగా పెంచుతున్నాడు. మానస నిజామాబాద్ లోని షాపింగ్ మాల్ లో ఉద్యోగం చేస్తుంది.
రోజూలాగానే సోమవారం దుకాణం వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. అనంతరం పాఠశాల వద్దకు వెళ్లి పిల్లలను తీసుకొని బాసర వెళ్లింది. కాసేపు పిల్లలతో గడిపి.. అనంతరం ముగ్గురు కలిసి గోదావరి నది వద్దకు చేరుకున్నారు. అక్కడే పిల్లల బాక్సుల్లోని అన్నాన్ని తన చేతులతో గోరు ముద్దలు తినిపించి.. నీళ్లు తాగించింది. అనంతరం బూట్లు విప్పి, స్కూల్ బ్యాగులను పక్కన బెట్టింది. అక్కడే వీరిని స్థానికులు సైతం గమనిస్తున్నారు. అయితే వారు స్నానానికి వెళ్తున్నారని అందరూ భావించారు. ఆమె పిల్లలను తీసుకుని లోపలికి వెళ్తుండటంతో స్థానికుల్లో కొందరు కీడు శంకించారు. వారిలోని ఓ వ్యక్తి కాపాడేందుకు నదివైపు పరుగులు తీశాడు.
అప్పటికే ఆ ఇద్దరు పిల్లలు తల్లీ నీటమునిగారు. తాము చూస్తుండగానే ముగ్గురు విగత జీవులుగా మారడం చూసి యాత్రికులు తల్లడిల్లిపోయారు. ఆ తల్లికి ఏమి కష్టాలు ఉన్నాయో అని అనుకున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న స్కూల్ బ్యాగ్ లోని వివరాల ఆధారంగా వీరు నిజామాబాద్ కు చెందిన వారని గుర్తించారు. మానస అన్నయ్య సందీప్ వచ్చి.. విగత జీవులుగా ఉన్న చెల్లెలు, ఆమె బిడ్డలను చూసి గుండెలు పగిలేలా రోదించాడు. భర్తలేక ఒంటరిగా జీవిస్తూ, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.