మనిషిని కోడి దాడి చేసి చంపేయడం కేవలం సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. నిజ జీవితంలో చాలా అరుదుగా జరుగుతుంది. అయితే అలాంటి అరుదైన ఘటనే చోటుచేసుకుంది. మనిషిని అత్యంత దారుణంగా కోడి చంపేసింది.
సాధారణంగా మనుషులే జంతువులపై అకారణంగా దాడి చేస్తుంటారు. అవి కేవలం తమ ఆత్మరక్షణ సమయంలోనే మనుషులకు ఎదురు తిరుగుతాయి. అది కూడా పెద్ద జంతువులు అయితేనే మనిషికి ఎదురు తిరుగుతాయి. ఇక కోడి వంటి చిన్న ప్రాణులపై మనుషులే దాడి చేస్తుంటారు. వాటిని చంపేసి వండుకుని ఆహారంగా తింటుంటారు. కోడిని చంపిన మనషుల్లే సమాజంలో ఎక్కువ కనిపిస్తుంటారు. కానీ మనిషిని కోడి చంపేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే తన పిల్లల జోలికి వస్తే మాత్రం మనుషులు, ఇతర జంతువులపై ఎదురు దాడి చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో కోడి తన నోరు, కాళ్లతో ఇతర ప్రాణుల పై దాడి చేస్తుంది. అయితే తాజాగా ఓ కోడి తన యజమానిపై దాడి చేసి ఏకంగా చంపేసింది. ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఘటన ఐర్లాండ్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఐర్లాండ్ దేశంలోని కిల్లాహోర్నియాకు రాష్ట్రంలో జాస్పర్ క్రాస్(67) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. జాస్పర్ కు మూగజీవాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇళ్లలో పెంచుకునే జంతువులు, పక్షులు అంటే ఆయనకు ప్రాణం. అందుకే ఆయన తన ఇంటి ఆవరణంలో కొత్త ప్రదేశాన్ని మూగజీవాలను పెంచుకునేందుకు కేటాయించాడు. ఇలా ఇంట్లోనే పెంపుడు జంతువులు అయిన కోళ్లు, కుక్కలు, పిల్లులు లాంటివి పెంచేవాడు. చిన్నపాటి పౌల్ట్రీని కూడా ఆయన నడిపేవారు.
నీరు, ఆహారం గూడు అందిస్తూ వాటి సంరక్షణను జాస్పర్ చూసుకునేవారు. ఆయన ఇంట్లో ఇంట్లో ఓ అరుదైన జాతికి చెందిన కోడి కూడా ఉంది. ఆ కోడి ఎంతో హుషారుగా, చాలా దూకుడుగా ఉండేది. నిత్యం ఆయన బయటకు వెళ్లే సమయంలో అన్ని జీవులను పలకరించే వెళ్తుండే వాడు. ఎప్పట్లాగానే జాస్పర్ క్రాస్ ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. వాటి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆ అరుదైన కోడి జాస్పర్ పై ఒక్కసారిగా దాడి చేసింది. ఆయన కాలు వెనుక భాగంలో కోడి.. తన కాళ్ల గోర్లతో దాడి చేసింది. నరాలు తెగిపోవడంతో క్రాస్ కు తీవ్ర రక్తస్రావం అయింది. రక్తం తీవ్రంగా పోవడం, అకస్మాత్తుగా తనపై దాడి జరగడంతో షాక్ గురయ్యాడు.
ఈ క్రమంలోనే ఆయన గుండెపోటు రావడంతో అక్కకడిక్కడే మరణించారు. ఈ విషయాన్ని జాస్పర్ కూతురే తెలిపారు. గతంలోనూ ఈ కోడి తన కుమార్తెపై కూడా దాడి చేసిందని ఆమె తెలిపారు. కోడి పుంజు.. మనిషిని చంపే సీన్లు కొన్ని తెలుగు సినిమాల్లో చూసుంటారు. పల్నాటి బ్రహ్మనాయుడు మూవీలో హీరో బాలయ్యకి చెందిన చిన్నమల్లు అనే కోడి పుంజు ప్రతినాయకుడ్ని తన కాలి గోళ్లతో రక్కి రక్కి చంపిన సన్నివేశం ఇప్పటికి కళ్లముందు కనిపిస్తుంది. అలాంటి సినిమా సీన్.. జాస్పర్ ఘటన విషయంలో జరిగింది. మరి.. ఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.