సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని ప్రాంతాల ప్రజల్లో నాటుకు పోయిన మూఢ నమ్మకాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. జంతు బలుల వంటి క్రూరమైన క్షుద్ర పూజల్ని అనుసరిస్తూనే ఉన్నారు. ఈ మూఢ నమ్మకాలు పెద్దల్లోనే కాదు.. చిన్న పిల్లల్లోనూ బలంగా నాటుకు పోయాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన ఒకటి తాజాగా ఒరిస్సాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రిత ఒరిస్సా, బోలాన్గిర్ జిల్లా, పండార పిట గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు జంతు బలి నిర్వహించారు. ఓ చిన్న కుక్క పిల్లను దేవుడికి బలిచ్చారు. ప్లాస్టిక్ డ్రమ్లను వాయిస్తూ క్షుద్రపూజ నిర్వహించారు. వీరిలోని ఓ పిల్లాడు పూజారిలా మారి ఈ పూజ జరిపించాడు. కుక్క పిల్లను బలిచ్చిన తర్వాత దాని రక్తాన్ని కూడా తాగారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారు కుక్క పిల్ల రక్తం తాగినట్లు తేల్చారు. రేబిస్ వ్యాధి సోకకుండా ఉండేందుకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లను వేశారు. కాగా, బోలాన్గిర్ జిల్లాలో జంతు బలులు నిర్వహించటం సర్వసాధారణం. సులియా జాత్రా, పట్కండ జాత్ర, కండుల్ జాత్ర వంటివి బాగా ప్రాచూర్యం పొందాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఈ జంతు బలుల్లో పాల్గొంటారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.