నేటికాలంలో యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు భయపడి, ఏమీ సాధించలేక పోతున్నామని భావించి.. జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. ఇదే తరహాలో నగరానికి చెందిన బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఇది కూడా చదవండి : అందంగా లేవంటూ భార్యను వేధించిన భర్త.. తట్టుకోలేని ఆమె
ఆ వివరాలు.. శేరిలింగంపల్లి డివిజన్లోని దుబే కాలనీలో నివసించే సౌజన్య (21).. బాచుపల్లి డీఆర్కే కాలేజీలో బీటెక్ చదువుతోంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాయ్ కాలనీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నకూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమార్తె ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో అన్ని కోణాల్లో పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు.