ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఐదు నిమిషాల శారీరక సుఖం కోసం చాలా మంది పచ్చని తమ కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భార్య.. భర్త బయటకు వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అయితే.. కాసేపటికే బయటికెళ్లిన భర్త తిరిగొచ్చాడు. వారిద్దరూ ఏకాంతంగా కామక్రీడల్లో మునిగి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. భార్య, ప్రియుడితో గొడవపెట్టుకున్నాడు. చివరకు వీరి వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భింద్లో చోటుచేసుకుంది.
ఆ వివరాలు.. మధ్య ప్రదేశ్, భింద్ జిల్లాలోని సైనిక్ కాలనీకి చెందిన మషుకా, రంజిత్ భార్యాభర్తలు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అంతలోనే మషుకా తప్పుడు దారిలో వెళ్లింది. పిపాహడి ప్రాంతానికి చెందిన రవి గుర్జార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో భర్త లేనప్పుడు వీరిద్దరు శారీరకంగా కలుసుకునేవారు. ప్రియుడిని ఇంటికే పిలిపించుకొని రాసలీలలు జరిపేది. ఈ క్రమంలో ఫిబ్రవరి 9న మషుకా భర్త రాత్రి వేళ ఓ ఊరేగింపు కార్యక్రమానికి బయటకు వెళ్లాడు. ఇదే మంచి సమయమని భావించిన మషుకా.. తన ప్రియుడు రవికి కాల్ చేసి ఇంటికి పిలిపించుకుంది. బయటకు వెళ్లిన భర్త.. కాసేపటి తర్వాత సడెన్గా ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో భార్య, ఆమె ప్రియుడు రాసలీలల్లో మునిగి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.
ఇది కూడా చదవండి : రోజు ఆ పని చేస్తున్నాడని ఓ భార్య దారుణం!
భార్య.. ప్రియుడితో అసభ్యకర రీతిలో ఉండడం చూసిన రంజిత్.. భార్యతో పాటు ఆమె ప్రియుడిపై దాడి చేశాడు. తప్పు జరిగిందని ఇంకోసారి ఇలా చేయమని భార్య, ప్రియుడు వేడుకున్నారు. క్షమాపణ చెబుతున్న దృశ్యాలను రంజిత్ వీడియో తీశాడు. అంతేకాదు రవి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు..అత్యాచారం కేసు పెడతానని బెదిరించాడు. దీంతో భయడిపోయిన రవి ఏటీఎం కార్డు తీసి రంజిత్ కి ఇచ్చాడు. రంజిత్ తన స్నేహితుడిని ఇంటికి పిలిచి ఏటీఎం కార్డు నుంచి రూ.70 వేలు డ్రా చేసుకున్నాక రవిని వదిలి పెట్టారు.
ప్రియురాలి ఇంటి నుంచి బయటపడ్డ రవి.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. మషుకా భర్త తనపై దాడి చేసి రూ.70 వేలు దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రియురాలు, ఆమె భర్త, స్నేహితులు తనపై దాడి చేసి డబ్బు దోచుకున్నారని ఆరోపించాడు. తాను క్షమాపణలు చెప్పిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మషుకా భర్త రంజిత్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.