ఈ మద్య భార్యాభర్తల మధ్య వస్తున్న చిన్న చిన్న వివాదాలు ఎన్నో దారుణాలకు తెరలేపుతున్నాయి. ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నాయి.
ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురైతు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు, పని ఒత్తిడి కారణాలు ఏవైనా తీవ్రమైన డిప్రేషన్ లోకి వెళ్లి ఎదుటివారిపై దాడులు చేయడం.. లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం లాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ప్రపంచంలో భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ఈ మద్య భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా విడిపోవడమో.. లేదా ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. తనకు చెడ్డ పేరు తీసుకు వస్తుందని కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన మహదేవపుర లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహదేవపుర నగర పరిధిలో వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ సమీపంలో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్యచేశాడు భర్త. నగరంలో కొంతకాలంగా తారానాథ్ అతని భార్య సరిత(35) పానీపూరి షాపు నిర్వహిస్తున్నారు. పెళ్లైన కొత్తలో దంపతులు ఎంతో అన్యోనంగా ఉండేవారు. అయితే సరిత ఇటీవల పలు చోట్ల చిన్న చిన్న చోరీలకు పాల్పపడుతూ వస్తుంది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్త పడుతుంది. ఈ మద్య ఆమె చేసిన దొంగతనాలు బయట పడటంతో అందరూ ఆమెను దొంగ అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. అంతేకాదు తారానాథ్ ని కూడా అనుమానంగా చూడటం మొదలు పెట్టాడు. భార్యకు ఎంత నచ్చజెప్పినా.. ఆమె తన స్వభావం మార్చుకోకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు తారానాథ్.
పరువుగా ఏదో చిన్న వ్యాపారం చేసుకంటూ జీవిస్తున్న తాను భార్య చేస్తున్న పనివల్ల పదిమందిలో తీవ్ర అవమానం పొందుతున్నానని బాధపడుతూ వచ్చాడు తారాసింగ్. సమాజంలో తనకు చెడ్డ పేరు తీసుకువస్తున్న భార్య అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు తారానాథ్. పలుమార్లు ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడు.. ఈ క్రమంలోనే ఆమె గొంతుకు తాడు బిగించి హత్యచేశాడు. భయంతో తారానాథ్ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి చివరికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన మహదేవపురలో తీవ్ర కలకం రేపింది. వైట్ఫీల్డ్ పోటీసులు పరిశించి కేసు నమోదు చేసుకొని తారానాథ్ ని అరెస్ట్ చేశారు.