ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ, పరిస్థితుల దృష్ట్యా చివరికి పెళ్లి వరకు వెళ్లలేకపోతారు. మరి కొంతమంది మాత్రం ఎన్ని కష్టాలు అడ్డొచ్చినా.. పెద్దలను ఎదురించి మరీ ప్రేమించిన ప్రియురాలినే పెళ్లి చేసుకుంటుంటారు. అచ్చం ఇలాగే భావించిన ఓ యువకుడికి తన ప్రియురాలు ఊహించని షాకిచ్చింది. ఆమె తన ప్రియుడిని కాదని మరొక యువకుడితో పెళ్లికి రెడీ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు నేరుగా ప్రియురాలి ఇంటి ముందుకెళ్లి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలోని తిరుపతి జిల్లా కోట మండలంలోని ఎస్టీ కాలనీలో కోట్లపూడి తేజ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. అయితే ఇతనికి గత కొన్నిరోజుల కిందట ఓజిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. చివరికి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు మరో యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న తేజ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇది తట్టుకోలేని తేజ ఆదివారం ఓజిలి మండలంలో ఉన్న తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వెళ్లిన వెంటనే తేజ తన ప్రియురాలిని బయటకు రావాలని పిలిచాడు.
ఎంత పిలిచినా.. ఆ యువతి మాత్రం బయటకు రాలేదు. దీంతో క్షణికావేశంలో ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తనపై పోసుకుని నిప్పింటించుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేసి ఆ యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై తేజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.