తాజాగా దొంగలు సినిమా స్టైల్ లో రెచ్చిపోయారు. ఓ ఆర్టీసీ బస్సును చేజ్ చేసి బస్సులో ఉన్న వ్యక్తి వద్ద రూ.10 లక్షలు కాజేశారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ముమ్మాటికి నిజం. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో దోపిడి దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ చివరికి అడ్డొచ్చిన వారిని కూడా అంతమొందించేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రంగారెడ్డి జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. బస్సును చేజ్ చేసి అందులో ఉన్న నగల వ్యాపారీ వద్ద రూ.10 లక్షలు చోరీ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లా నారాయణ పేట్ నుంచి హైదరాబాద్ కు శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బయలు దేరింది. అందులో నగల వ్యాపారీ శివ రూ.10 లక్షలతో వెళ్తున్నాడు. దీనిని గమనించిన కొందరు దొపిడి దొంగలు పక్కా ప్లాన్ తో అతని వద్ద ఉన్న డబ్బును కాజేయాలని అనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే ఆ దుండగులు సినిమా స్టైల్ లో ఆ ఆర్టీసీ బస్సును చేజ్ చేసి శివరాంపల్లి వద్ద అడ్డుకున్నారు. అనంతరం దొంగలు బస్సులో ఉన్న నగల వ్యాపారి శివను కత్తిలతో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.10 లక్షలు లాగేసుకున్నారు. ఆ తర్వాత ఆ దుండగులు అతని కంట్లో కారం చల్లి అక్కడి నుంచి పరారయ్యారు.
ఆ బస్సులో ఉన్నవాళ్లంతా దీనిని సినిమా చూసినట్లు చూశారు తప్పా.. ఆ దొంగలను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో బాధితుడు శివ నెత్తినోరు కొట్టుకున్నాడు. ఇక చేసేదేం లేక ఆ నగల వ్యాపారి రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. సినిమా స్టైల్ లో బస్సును చేజ్ చేసి రూ.10 లక్షలు చోరీ చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.