వేగంతో పరుగులు తీస్తున్న కాలంతో పాటు నేరాలు కూడా అదే దూకుడుతో వెళ్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా బాలికలపై వయసుతో సంబంధం లేకుండా కొంతమంది కామంధులు అఘాయిత్యాలకు కాలుదువ్వుతున్నారు. ఇలాంటి ఘోరాలు ఈ మధ్య కాలంలో మరింత శృతి మించుతు సభ్య సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇక తాజాగా ఇలాంటి దారుణమైన ఘటనే ఒకటి విజయవాడ నడిబొడ్డున చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని నున్న సమీపంలో నివసించే భార్యభర్తలకు ఇద్దరు కుమార్తెలు. భర్త జాతీయ విద్యాసంస్థలో పీడీగా పనిచేస్తున్నా.. బుద్ది మాత్రం వక్రమార్గంలోకి అడుగులు వేసింది. కామంతో రగిలిపోయిన ఈ కసాయి తండ్రి కన్న కూతురిపై ఓ కన్నేశాడు. దీంతో అయిదేళ్లు కూడా నిండని ముక్కు పచ్చలారని అమాయకపు చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డాడీ దుర్మార్గుడు. దీంతో గత రెండు మూడు రోజుల నుంచి ఆ పాప ఆరోగ్యం బాగలేకపోవటంతో తల్లి గమనించింది.
ఏంటని అడిగితే ఆ చిన్నారి వచ్చిరాని మాటలతో తండ్రి చేసిన ఘోరాన్నంత పూసగుచ్చినట్లు వివరించింది. దీంతో అగ్రహానికి గురైన తల్లి ప్రశ్నించేసరికి ఏకంగా ఇంటినుంచే పారిపోయాడు. ఇక కొన్ని రోజులకు మళ్లీ వచ్చి కూతురుని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో ఆ చిన్నారి అమ్మమ్మ తీసుకుపోకుండా అడ్డుపడి బాలికను రక్షించింది. ఈ విషయం తల్లికి తెలియటంతో పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు పోక్సో చట్టం కింద ఈ నెల 6న కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక సభ్యసమాజం తలదించుకునేలా కన్నకూతురిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఈ కసాయి తండ్రి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.