తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినడం లేదు పిల్లు. మందలించేందుకు కళ్లు ఎర్ర చేసినా మండిపడుతున్నారు. అస్తమాను సెల్ ఫోన్లలో తల పెట్టేసి.. చదువు అటకెక్కిస్తున్నారు. మొండిగా వ్యవహరిస్తున్నారు. చిన్న దెబ్బ కొట్టినా కూడా ఊరుకోవడం లేదు. అలా తల్లిదండ్రులు కొడుతున్నారని ఓ బాలుడు ఏకంగా
అమ్మో నేటి పిల్లలు చాలా తెలివి మీరిపోయారు. వారిని ఏమి అనలేకపోతున్నామమ్మా అంటూ ఇంట్లో పెద్దలు అంటుంటారు. ఇటీవల అనేక మంది ఇళ్లల్లో నాన్నమ్మలు, తాతయ్యలు అంటున్న మాట. తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినడం లేదు పిల్లు. మందలించేందుకు కళ్లు ఎర్ర చేసినా మండిపడుతున్నారు. అస్తమాను సెల్ ఫోన్లలో తల పెట్టేసి.. చదువు అటకెక్కిస్తున్నారు. పనులు చెప్పినా కూడా.. చిన్న పిల్లలతో పని చేయించకూడదు.. పోలీసులకు చెబుతామంటూ బెదిరిస్తున్నారు. మొండిగా వ్యవహరిస్తున్నారు. చిన్న దెబ్బ కొట్టినా కూడా ఊరుకోవడం లేదు. ఒక్కోసారి ఎదురు తిరుగుతుంటారు కూడా. అలా తల్లిదండ్రులు కొడుతున్నారని ఓ బాలుడు ఏకంగా పోలీస్ స్టేషన్కే వెళ్లిపోయాడు.
తల్లిదండ్రులు చీటికి మాటికి తనను కొడుతున్నారంటూ.. వారిపై కేసు నమోదు చేయండి సార్ అంటూ 11 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్ పల్లి మున్నిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్లో ఉంటున్నారు నర్సింలు, లక్ష్మి దంపతులు. వీరి కుమారుడు రాములు ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే తనను అస్తమానూ తల్లిదండ్రులు కొడుతున్నారంటూ .. వారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. అయితే తొలుత విస్తుపోయిన పోలీసులు.. తేరుకుని రాములు తల్లిదండ్రులను పిలిపించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్టు ఎస్సై సంతోష్ వెల్లడించారు. అబ్బాయిని కొట్టొద్దని, మరోసారి తమ దృష్టికి రావొద్దని హెచ్చరించి పంపారు. రాముల్ని బాగా చదువుకోవాలని సూచించారు.