తెలంగాణ హైకోర్టు మనవతా దృక్పథంతో ఓ మైనర్ బాలిక గర్భస్రావానికి అనుమతులు జారీ చేసింది. ఇక విషయం ఏంటంటే? ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లోని ఓ బస్తీలో ఉండే ఓ బాలికపై కమ్మం జిల్లా వాసి బాలికను మోసం చేసి రోజూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్భవతి అని తేలడంతో ఆ బాలిక తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వెంటనే నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇది కూడా చదవండి: మద్యం మత్తులో విర్రవీగిన కామాంధుడు.. తాడుతో కట్టి ఆవుపై దారుణం!
దీంతో బాలిక మైనర్ కావడంతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఆ బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం ఆ మైనర్ బాలిక పట్ల మనవతా దృక్పథంతో వెంటనే స్పందిస్తూ గర్భస్రావానికి అనుమతినిస్తూ నిలోఫర్ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు బాలికకు గర్భస్రావం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ సదరు బాలిక కుటింభికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలిక పట్ల కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.