తెలంగాణలో ఉద్యోగాల జాతర మళ్లీ మొదలయింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ ఘటనతో కొన్నాళ్లు నోటిఫికేషన్లు వాయిదా పడిన, మళ్లీ ఖాళీల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్నాయి.
తెలంగాణలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 91 స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ టైపింగ్ వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
జిల్లాల వారిగా ఖాళీలు:
ఆదిలాబాద్- 02, భద్రాద్రి కొత్తగూడెం- 02, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు- 06, సిటీ స్మాల్ కాసెస్ కోర్టు- హైదరాబాద్- 02, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు- హైదరాబాద్- 02, జగిత్యాల- 03, జనగామ- 01, జయశంకర్ భూపాలపల్లి- 02, జోగుళాంబ గద్వాల- 01, కామారెడ్డి- 01, ఖమ్మం- 01, కుమరంభీమ్ ఆసిఫాబాద్- 02, మహబూబాబాద్- 03, మహబూబ్నగర్- 01, మంచిర్యాల- 04, మేడ్చల్ మల్కాజ్గిరి- 04, మెదక్- 01, ములుగు- 01, నాగర్ కర్నూల్- 05, నల్లగొండ- 01, నారాయణపేట- 03, నిజామాబాద్- 05, పెద్దపల్లి- 01, రంగారెడ్డి- 14, సంగారెడ్డి- 05, సిద్ధిపేట- 03, సూర్యాపేట- 04, వికారాబాద్- 05, వనపర్తి- 02, వరంగల్- 01, యాదాద్రి భువనగిరి- 03.
విభాగాలు: స్టెనోగ్రాఫర్
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్రైటింగ్ వచ్చి ఉండాలి. (నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి)
వయోపరిమితి: 01.07.2023నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 వరకు వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంగ్లిష్ షార్ట్హ్యాండ్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం 100 మార్కులకు స్కిల్టెస్ట్ నిర్వహిస్తారు. 5 నిమిషాల ఇంగ్లిష్ షార్ట్హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. నిమిషానికి 120 పదాలు టైప్ చేయగలగాలి. అలాగే కంప్యూటర్ మీద 45 నిమిషాల ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థుల 35 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు 30 శాతం కనీస అర్హత మార్కులు సాధించాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
దరఖాస్తు చేయు విధానం: ఆన్లైన్.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25.05.2023
దరఖాస్తులకు చివరి తేది: 15.06.2023