మారుతున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా పిల్లల ఆలోచనల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. పాశ్చత్య పోకడలను అలవాటు చేసుకుంటూ ఇదే ప్యాషనంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఇలా తమకు నచ్చినట్టు జీవించే క్రమంలో కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటను అస్సలు లెక్క చేయడంలేదు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను మందలడంతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు.
అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ 10వ తరగతి బాలిక తండ్రి మందలించాడనే కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తాజాగా తాండూరులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తాండూరు పరిధిలోని హంక్య నాయక్ తండాకు చెందిన దీపిక (15) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అయితే ఇటీవల కాలంలో స్కూల్స్ రీ ఓపెన్ కావడంతో ఈ నెల 20న దీపికను స్కూలుకు వెళ్లాలంటూ తండ్రి మందలించాడు.
ఇది కూడా చదవండి: Mysuru: కట్టుకున్నవాడిని కాదని సీక్రెట్ గా ప్రేమాయణం.. భార్యకు తెలియకుండా భర్త!
దీనికి ససేమిరా అన్న దీపిక తండ్రితో వాగ్వాదానికి దిగింది. దీంతో తండ్రి కూతురిని గట్టిగా మందలించాడు. దీపిక తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు బ్యాగు వేసుకుని స్కూలుకు వెళ్లింది. ఇక సాయంత్రమైన కూతురు ఇంటికి రాకపోవడంతో తండ్రి కాస్త ఖంగారుపడ్డాడు. అటు, ఇటు అంతా వెతికాడు. అయినా దీపిక జాడ మాత్రం కనిపించలేదు. అలా రెండు రోజుల పాటు తల్లిదండ్రులు బంధువుల ఇళ్లల్లో చూసిన దీపిక కనిపించలేదు. వెంటనే ఆ బాలిక తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.