బాలికకు దెయ్యం పట్టిందని ఓ భూత వైద్యుడు దారుణమైన ఘతుకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో తాండూరు గ్రామానికి చెందిన రాజేష్, సుజాత ఇద్దరు భార్యాభర్తలు. వీరికి చిన్ని అనే కూతురు ఉంది. అయితే ఇటీవల హోళీ పండుగ రోజు అనారోగ్యపాలైంది. చదువుకోని తల్లిదండ్రులు కావడంతో చిన్నిని స్థానికంగా ఉండే ఓ భూత వైద్యుడి వద్ద తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: చికెన్ మంచిది ఇవ్వలేదని ఓనర్పై రాళ్లు, కర్రలతో ఎటాక్!
అతడు మాత్రం దెయ్యాన్ని పారదోలుతానని ఆ బాలికపై కర్కషంగా వ్యవహరించాడు. అగరుబత్తులతో పెదాలు, నడుం, ప్రైవేట్ భాగాలపై వాతలు పెట్టాడు. దీంతో ఆ బాలిక తీవ్ర అస్వస్థకు గురవ్వడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలిక తల్లిదండ్రులు ఆ భూత వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిని అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.