వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. నేటి కాలంలో ఇలాంటి క్రైమ్ స్టోరీలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాగే బరితెగించిన ఓ భార్య తన కూతురి ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే? తమిళనాడులోని కడలూరు నైవేలికి చెందిన ఓ వ్యక్తికి చాలా ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.
భార్యతో పాటు కొన్నాళ్ల పాటు బాగానే సంసారం చేశాడు. ఇక వారి కూతుళ్లకు పెళ్లిళ్లు చేసే వయసుకొచ్చిన కూడా అతని బుద్దిని మార్చుకోలేదు. ఆ వ్యక్తి భార్యను కాదని పరాయి మహిళపై మోజు పడ్డాడు. దీంతో ఈ విషయం భార్యకు తెలియడంతో తట్టుకోలేకపోయింది. ఇక ఎలాగైన భర్తను చంపాలని ప్లాన్ గీసిన భార్య పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే.. తన చిన్న కూతురి ప్రియుడిని సాయం కోరింది. ఓ రోజు ఫోన్ చేసి.. ఈ రాత్రికి మా ఇంటికి వచ్చి నా భర్తను చంపాలని.. అలా చేస్తే నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేస్తానని హామీ ఇచ్చింది.
ఇక అత్త మాటలు విన్న అల్లుడు సరే నంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అనుకున్నట్లుగానే కూతురి ప్రియుడితో కలిసి భార్య భర్తను దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని భార్యను విచారించారు. మొదట్లో మాత్రం.. నా భర్త తాగొచ్చి రోజూ గొడవ చేస్తున్నాడని, ఇటీవల కూడా మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపింది. అదే రోజు రాత్రి నేను ఇంటి నుంచి బయటకు వచ్చానని, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని నాటకమాడింది.
ఆమె మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు గట్టిగా విచారించారు. అయితే చివరికి చేసిన తప్పు ఒప్పుకున్న భార్య.. అవును.. నా భర్తను నా చిన్న కూతురు ప్రియుడితో కలిసి హత్య చేశానంటూ అసలు నిజం బయటపెట్టింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళతో పాటు తన కూతురి ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.