అందమైన అమ్మాయిలే టార్గెట్ గా చేసుకుని కొందరు కేటుగాళ్లు గలీజ్ దందాకు శ్రీకారం చుడుతున్నారు. అమ్మాయిలను నమ్మించి ఉద్యోగం పేరుతొ నగరాలకు తీసుకొస్తున్నారు. ఇక వచ్చాక బలవంతంగా వ్యభిచారంలోకి దించేసి అందినకాడకి దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్, యాదగిరిగుట్టలో రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇక ఇది మరువకముందే తాజాగా భీమవరంలో మరో దందా వెలుగులోకి వచ్చింది. మసాజ్ సెంటర్ ముసుగులో అమ్మాయిలను రప్పించుకుని పాడు పనులతో డబ్బులు కూడబెడుతున్నారు. అయితే ఘటనపై స్పందించిన పోలీసులు వారి గట్టును రట్టు చేసి మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు.
నగరంలో కొందరు కేటుగాళ్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతూ చివరికి వ్యభిచారాన్ని నిర్వహించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలానే వెలుగు చూశాయి. అయితే ఇవి మరుకముందే తాజాగా మరో ఘటన శ్రీకాకుళం జిల్లా భీమరవంలో వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా బురద ఝాన్సీలక్ష్మీ అనే మహిళ గత కొంత కాలం నుంచి మసాజ్ సెంటర్ పేరుతో గలీజ్ పనులకు శ్రీకారం చుట్టింది. ఇక్కడే ఈ మహిళ గత కొంత కాలం నుంచి అమ్మాయిలు, మహిళలతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చాకచక్యంతో ఝాన్సీలక్ష్మి నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు ఝాన్సీలక్ష్మీతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ఇక వీరితో పాటు మరో ఏడుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద రూ.31,500 నగదుతో పాటు చెక్ బుక్, స్వైపింగ్ మిషన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న రాహుల్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆ తర్వాత పోలీసులు మాట్లాడుతూ.. ఇలాంటి వ్యభిచారం నిర్వహించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.