ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ ప్రియురాలు ఆత్మహత్య, ప్రియురాలు నమ్మించి ద్రోహం చేసిందంటూ ప్రియుడు బలవన్మరణం. ఇవే నేటి కాలంలో జరగుతున్న ఘటనలు. మొదట్లో ప్రేమ పేరుతో కలిసి తిరిగిన ప్రేమికులే రోజులు గడిచే వారి వారే శత్రువులుగా మారుతున్నారు. చివరికి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే హత్యలు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలోనే ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మరో యువతితో పారిపోయాడు. దీనిని భరించలేని ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలోని మనోహరాబాద్ గ్రామం. ఇదే గ్రామంలో నివాసం ఉంటుంది శ్రావణి అనే యువతి. అయితే స్థానికంగా ఉండే ఓ పరిశ్రమలో శ్రావణి పని చేస్తుండేది. అక్కడ పని చేస్తున్న క్రమంలో సొంత గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నారు. అలా వారి ప్రేమయాణం కొన్నేళ్ల పాటు సాగుతూ వచ్చింది.
ఇది కూడా చదవండి: TV Actress Mythili: పంజాగుట్టలో విషాదం.. ఆత్మహత్యాయత్నం చేసిన టీవీ నటి.. నిమ్స్కు తరలింపు!
ఇక దీంతో ఎలాగైన ప్రియుడిని పెళ్లాడాలని భావించిన శ్రావణి తల్లిదండ్రులను ఒప్పించింది. వీరి పెళ్లికి ఇరువురి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. తొందర్లోనే పెళ్లి కూడా జరగాల్సి ఉంది. కట్ చేస్తే ప్రియుడు అదే గ్రామానికి చెందిన యువతిని లేపుకెళ్లి శనివారం హైదరాబాద్ లోని ఓ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రావణి తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
శ్రావణి రణవార్త తెలుసుకున్న శ్రావణి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక కూతురు మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతురాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.