పొట్టపూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వలస వచ్చారు. రెక్కలు ముక్కలయ్యేలా కాయకష్టం చేస్తూ.. పొట్టనింపుకుంటున్నారు. ఇలాంటి అమాయక బాలికలపై కొందరు స్థానిక వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తూ.. దారుణానికి పాల్పడ్డారు. ఈ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు.
దేశంలో అత్యాచార దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇటు 3 మూడేళ్ల చిన్నారి నుంచి అటు 80 ఏళ్ల ముసలవ్వల వరకు ఇలా ఎవరినీ వదలకుండా దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి దారుణాలు దేశంలో రోజుకొక చోటు వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే కొందరు దర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తించారు. అభం, శుభం తెలియని బాలికలపై కన్నేస్తూ.. చివరికి ఊహించని పాడు పనులకు శ్రీకారం చుట్టారు. అసలేం జరిగిందంటే?
ఒరిస్సాకు చెందిన 30 కుటుంబాలు పిల్లలతో పాటు పొట్టకూటి కోసం తెలంగాణకు వలస వచ్చారు. అయితే వీళ్లంతా సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట మండలంలోని దర్గా తండాలో నివాసం ఉంటున్నారు. ఇకపోతే వీరంతా.. స్థానిక సర్పంచ్ ఇటుక బట్టీలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఈ 30 కుటుంబాలలోని తమ మైనర్ బాలికలు కూడా తల్లిదండ్రులతో పాటే పనులు చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే? ఇటుక బట్టీకి యజమానులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఇక్కడ పని చేస్తున్న అమాయక మైనర్ బాలికలపై మోజు పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు.
మొత్తానికి ఏదైన ఆశ చూపి ఆ బాలికలతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నారట. ఇందులో భాగంగానే ఈ దుర్మార్గులు ఏకంగా ఏడుగురు బాలికలకు డబ్బులు ఆశ చూపి అనేక సార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల ఆ బాలికలు అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ బాలికలను పరీక్షించిన వైద్యులు.. అందరూ గర్భవతులు అయ్యారని వైద్యులు తెలిపారు. ఈ వార్త విన్న ఆ బాలికల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ దారుణ ఘటనతో ఉలిక్కిపడ్డ ఆ బాలికల తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు.
మొత్తానికి బాధిత కుటుంబాలు ఈ ఘటనపై ఒరిస్సా రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అక్కడి అధికారులు తెలంగాణ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన జిల్లా అధికారులు కొందరు అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటుక బట్టీలపై దాడులు చేస్తూ.. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనలంగా మారుతోంది. ఇటుక బట్టీల యాజమానులే మా పిల్లలపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితులు వాపోతున్నారు.
అభం, శుభం తెలియని అమాయక బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగుల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.