రంగారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తులో భర్త క్షణికావేశంలో భార్యను కొట్టి అనంతరం బ్లేడుతో కడుపు కోసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని షాద్ నగర్ పరిధిలోని కొత్తూరుకు చెందిన ఏసయ్య, దేవమ్మ ఇద్దరు భార్యాభర్తలు. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న వీళ్లద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు కాపురం సంతోషంగానే సాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే భర్త ఏసయ్య బాగా మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: భార్యతో హనీమూన్ లో నీచానికి దిగిన భర్త.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
దీంతో భార్యతో ఏదో విషయమై గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరగడంతో గొడవ తీవ్ర రూపం దాల్చింది. కోపంతో ఊగిపోయిన భర్త మద్యం మత్తులో క్షణికావేశంతో భార్యపై దాడికి దిగాడు. ఇక అనంతరం ఏం చేయాలో అర్థం కాక బ్లేడు తన పొట్టకోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఏసయ్యను షాద్ నగర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఏసయ్య క్షేమంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.