క్షణికావేశంలో కొందరు మహిళలు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ భర్త సినిమాకి తీసుకెళ్లలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పరిధిలోని భవానినగర్ కాలనీ. రాజు, స్వాతి అనే ఇద్దరూ మూడు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకుని శంకర్ పల్లిలో నివాసం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Jharkhand: హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. నవ జాత శిశువుని పీక్కుతిన్న ఎలుకలు!
అయితే గత కొన్ని రోజుల నుంచి భార్య స్వాతి సినిమాకు తీసుకెళ్లమంటూ భర్తను కోరింది. దీనికి భర్త నిరాకరించినట్లుగా తెలుస్తోంది. కాగా బుధవారం రాత్రి కూడా నైట్ షోకి తీసుకెళ్లాలంటూ స్వాతి భర్తను అడిగింది. దీనికి రాజు మరోసారి కూడా నిరాకరించాడు. దీంతో స్వాతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక గురువారం భర్త లేని సమయంలో స్వాతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.