సమాజంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కవయ్యాయి. బస్సుల్లో, బస్టాండ్ లలో, పనులు చేసే చోట ఎక్కడైనా సరే ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఏదో ఓ చోట కామాంధుల చేతిలో బలవుతూనే ఉన్నారు.
సమాజంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కవయ్యాయి. బస్సుల్లో, బస్టాండ్ లలో, పనులు చేసే చోట ఎక్కడైనా సరే ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఏదో ఓ చోట కామాంధుల చేతిలో బలవుతూనే ఉన్నారు. కామంతో మదమెక్కిన మగాళ్లు మృగాళ్లుగా మారి చిన్నపిల్లలు, పెద్దవారు అన్న తేడా లేకుండా ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. స్కూల్కి వెల్లే చిన్న పిల్లల దగ్గరి నుండి మహిళలు, వృద్దురాలు అనికూడా చూడకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. స్వామీజీ ముసుగులో ఓ అనాథ బాలికను లైంగికంగా వేధించిన సంఘటన మరవక ముందే మరో సంఘటన వినాల్సి వస్తుంది. ఇలా ఆడవారిపై జరుగుతున్నఘోరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో చట్టాలు అమలులోకి తెచ్చింది. అయినా స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది. అందుకే అతివలపై జరిగే అకృత్యాలకు మహిళలే ప్రతిఘటించి పోరాడి.. తమను తాము కాపాడుకోవాలి అని నిరూపించింది. ఓ మహిళ తాజాగా ఓ ఘటనలో తనపై జరుగుతున్న అఘాయిత్యానికి ప్రతిఘటించి పోరాడి చివరకు ఏం చేసిందో చూద్దాం. పూర్తి వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళపై ఓ వ్యక్తి మద్యం సేవించి.. అర్ధరాత్రి వచ్చి తలుపుతట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ తనను తానను రక్షించుకునే ప్రయత్నంలో ఆ దుండగున్ని రాడ్తో గట్టిగా కొట్టింది. రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేల్లో శ్రీనివాస్ అనే వ్యక్తి తాగిన మత్తులో.. గురువారం అర్థరాత్రి జయమ్మ అనే మహిళ ఇంటికి వచ్చి తలుపులు కొట్టాడు. ఆ సమయంలో జయమ్మ ఒంటరిగా ఉండడం దుండగుడు గమనించాడు. తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించాడు. జయమ్మపై అత్యాచారయత్నం చేయబోయాడు. అది గమనించి జయమ్మ బయటకు పరుగుల తీసింది. అయినా వదలకుండా శ్రీనివాస్ వెంబండించాడు. జయమ్మ పక్కనే ఉన్న ఇనుపరాడ్తో అతని తలపై గట్టిగా కొట్టింది. తీవ్రరక్తస్రావంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడయో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన తర్వాత భర్త బాలయ్యతో కలిసి జయమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.