ప్రస్తుత కాలంలో ఘరానా మోసాలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఆడా, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి పేరుతో చేసూ మోసాలు పెరుగుతున్నాయి. ఒకరికి తెలియకుండా ఒకరిని వరుస పెట్టి పెళ్లిల్లు చేసుకోవడం.. అందినకాడికి డబ్బులతో ఉడాయించడం చేస్తున్నారు. చివరకు బాధితులు తేరుకుని.. మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించేలోపే.. వారి ఖాతాలో మరి కొందరు బాధితులు చేరుతున్నారు. ఇక నేరస్తులు పోలీసులకు చిక్కేలోపు మరికొందరు నష్టపోతున్నారు. తాజాగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఘరానా లేడీని.. ఆమె రూట్లోనే వెళ్లి అరెస్ట్ చేశారు రాజస్తాన్ పోలీసులు. ఆ వివరాలు..
ఈ ఘరానా కిలేడీ పేరు రీనా ఠాకూర్ అలియాస్ కాజల్. రాజస్తాన్ దుంగార్పూర్ ప్రాంతంలో ఉండే రీనా వయసు 32 ఏళ్లు.. ఇప్పటి వరకు ఆమె చేసుకున్న వివాహాల సంఖ్య కూడా 32 కావడం గమనార్హం. మధ్యవర్తుల ద్వారా పెళ్లి సెట్ చేసుకోవడం, వివాహం అనంతరం అత్తింటికి వెళ్లి వారికి సంబంధించిన డబ్బు, నగలు దోచుకుని పరారు కావడం, మళ్లీ మరో పెళ్లికి సిద్ధ కావడం. ఇది ఆమె చరిత్ర. ఇప్పటికే ఎంతో మంది ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రీనాను అరెస్ట్ చేయడం కోసం ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ పోలీసులకు చిక్కలేదు.
ఇది కూడా చదవండి: Bride, Groom: వరుడి మెడలో తాళి కట్టిన వధువు.. గ్రామస్తులు ఏం చెబుుతున్నారో తెలుసా?
దీంతో పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ఓ పథకం వేశారు. తమ డిపార్ట్మెంట్కు చెందిన ఓ వ్యక్తిని వరుడిగా ఆమె వద్దకు పంపించారు. అతనితో ఆమె 33వ పెళ్లికి సిద్ధమై.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఆమెతో పాటు ఆమె గ్యాంగ్కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరినీ విచారిస్తున్నారు. 32 వివాహాలు చేసుకున్న రీనా ఠాకూర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.