శ్రద్ధా వాకర్.. ఈమె హత్య కేసు దేశవ్యాప్తంగా ఓ సంచలనంగా మారింది. తనను ప్రేమించిన వ్యక్తే ఆమెను హత్య చేసి 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివారులోని అడవిలో ఆమె శరీర భాగాలను పడేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో విషయం వెలుగోకి వచ్చింది. రెండేళ్ల క్రితమే శ్రద్ధా వాకర్ ప్రియుడు అఫ్తాప్ పూనావాలాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తనని శారీరకంగా హింసిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు లెటర్ రాసింది. అయితే ఆ లెటర్ ఇప్పుడు వెలుగు చూసింది.
శ్రద్ధా వాకర్ రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని వారి స్వగ్రామం వాసాయ్ తిలుంజ్ పోలీస్ స్టేషన్ అఫ్తాబ్పై ఫిర్యాదు చేసింది. ఆమెను శారీరకంగా బాగా గాయ పరిచిన తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె రాసిన లెటర్లో అఫ్తాబ్ క్రూరమైన ప్రవర్తన గురించి వారి తల్లిదండ్రులకు తెలుసని చెప్పింది. అలాగే వాళ్లిద్దరు కలిసి ఒకే ప్లాట్లో ఉంటున్న విషయం కూడా వారికి తెలుసని చెప్పింది. వారాంతాల్లో వాళ్లు వచ్చి వారితో గడి వెళ్తారంటూ వెల్లడించింది. అయితే ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత అఫ్తాబ్ తల్లిదండ్రులే శ్రద్ధాతో మాట్లాడి అతను మళ్లీ అలా ప్రవర్తించడని హామీ ఇచ్చారట. తర్వాత ఆమె పోలీసులను కలిసి ఫిర్యాదు వెనక్కి తీసుకుందట. అతని తల్లిదండ్రుల హామీతోనే అప్పుడు శ్రద్ధా కంప్లైంట్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
2020 నవంబర్లో అఫ్తాబ్ కొట్టిన తర్వాత ఇంటర్నల్ ఇంజురీస్తో శ్రద్ధా ఆస్పత్రిలో చేరిందట. అఫ్తాబ్ కొట్టిన తర్వాత ఆమె కొలీగ్ కరణ్కు వాట్సాప్లో ఈ విషయం వెల్లడించింది. అలాగే గాయలతో ఉన్న ఆమె ఫొటోని కూడా షేర్ చేసింది. ఆ లెటర్లో “ఈరోజు నాకు ఊపిరాడకుండా చేసి హత్య చేయాలని చూశాడు. నన్ను చంపి ముక్కలుగా నరికేస్తానంటూ బెదిరిస్తున్నాడు. నన్ను చంపుతాని బెదిరిస్తున్నా కూడా పోలీసులను ఆశ్రయించే ధైర్యం లేక అతని వేధింపులు భరిస్తున్నాను. నాకు అతనితో కలిసి ఉండాలని లేదు. అతను నన్ను శారీరకంగా హింసిస్తున్నాడు. నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు” అంటూ రెండేళ్ల క్రితమే శ్రద్ధా లెటర్లో రాసుకొచ్చింది.
అయితే వీళ్ల పరిచయం విషయానికి వస్తే.. 2019లో ఓ డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధా కపూర్- అఫ్తాబ్ పూనావాలకు పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ కాల్ సెంటర్లో పనిచేసేవారు. 202లో బ్లాక్మెయిల్ చేసిన తర్వాత కూడా వాళ్లు విడిపోలేదు. ఈ ఏడాది మేలోనే వాళ్లు ఢిల్లీకి మారారు. ఢిల్లీలో ఓ ఫ్లాట్ తీసుకుని ఇద్దరూ లివి ఇన్ రిలేషన్షిప్లోకి అడుగుపెట్టారు. శ్రద్ధా తమ తల్లిదండ్రులతో కూడా టచ్లో లేదు. ఎందుకంటే వాళ్లు కులాంతర వివాహాన్ని అంగీకరించలేదు. వాళ్లు ఢిల్లీ ఫ్లాట్కి మారిన కొన్ని నెలల్లోనే ఈ హత్య జరిగింది. శ్రద్ధా తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ విషయంలో పోలీసులను ఆశ్రయించగా ఈ కేసు వెలుగు చూసుంది. ఆమె ఫ్రెండ్స్ తో కూడా కొన్ని నెలలుగా కాంటాక్ట్ లో లేదని తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.
Shraddha Walker could have been saved had Uddhav Thackeray’s police acted.
See the date of letter, it’s Nov 2020. Uddhav was the CM.
When she was so explicit, why did the Maharashtra police not act? pic.twitter.com/1RC47zIEDA
— Shishir Rai 🇮🇳 (@shishirkrrai) November 23, 2022