ఓ మహిళ తన కన్న తల్లిని రోకలి బండతో కొట్టి చంపింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు ఆ మహిళ తల్లిని ఎందుకు హత్య చేసిందో తెలుసా?
తెలంగాణలో ఘోరం జరిగింది. ఓ మహిళ కనిపెంచిన తల్లిని అతి దారుణంగా రోకలి బండతో కొట్టి చంపింది. చనిపోయిందని తెలుసుకున్నాక వెంటనే అక్కడి నుంచి పరారైంది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మేడ గ్రామం. ఇక్కడే నాగం నర్సు (52) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు హరిత, అరుణ అనే ఇద్దరు కూతుళ్ల ఉన్నారు. భర్త గత 20 ఏళ్ల కిందటే చనిపోవడంతో కుమార్తెలకు వివాహం చేసింది. కాగా, అప్పటి నుంచి ఉమ్మేడలో ఓ రూమ్ లో కూతురు హరిత ఉండగా, మరో రూమ్ లో నర్సు ఉండేది. అయితే వీరిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ నెల 26న తన రెండవ కూతురు అరుణ ఇంట్లో తొట్లె ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కొందరు దగ్గరి బంధువులు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే నర్సు అక్కడికి వచ్చిన ఓ మహిళతో గొడవపడ్డట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న హరిత.. తల్లి నర్సుతో వాగ్వాదానికి దిగింది. దీంతో ఒకరిపై ఒకరు తల్లీకూతుళ్లు మాటల దాడి చేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన కూతురు హరిత ఇంట్లో ఉన్న రోకలి బండతో తల్లి నర్సు తలపై బలంగా బాదింది. ఈ దాడిలో రక్తపు మడుగులో పడి తల్లి నర్సు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి చనిపోయిందని తెలుసుకున్న కూతురు హరిత.. అక్కడి నుంచి పరారైంది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. క్షణికావేశంలో తల్లిని కొట్టి చంపిన కూతురు దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.