ఐదుగురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని ఇటీవల చంపారు. కొడుకుని చంపిన వారిని చంపి పగ తీర్చుకోవాలని ఆ యువకుడి తండ్రి సినిమా స్టైల్ లో ఓ భారీ స్కెచ్ వేశాడు. అసలేం జరిగింంటే?
ఎలాంటి తప్పు లేకపోయినా మనల్ని ఎవరైనా నిందించినా, కొట్టినా.. కొందరు బాధపడుతూ కూర్చుంటారు. కానీ, కొందరు మాత్రం ఎలాగైన నిందించిన వారిపై పగ తీర్చుకోవాలని రగిలిపోతుంటారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి తన కొడుకుని చంపిన వారిని చంపి పగ తీర్చుకోవాలని పథకం రచించాడు. ఇక ఇందులో భాగంగానే ఆ తండ్రి సినిమాటిక్ స్టైల్ లో భారీ స్కెచ్ వేసి చివరికి దొరికిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అతను వేసిన స్కెచ్ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిజామాబాద్ జిల్లా బోధన్ లో చాట్ల శివ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. ఓ వివాదంలో చాట్ల శివను మానే శివ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు కలిసి జనవరిలో హత్య చేశారు. దీంతో కొడుకు చనిపోవడంతో తండ్రి అయినా చాట్ల గోపి కన్నీరు మున్నీరుగా విలపించాడు. కొడుకు మరణాన్ని తలుచుకుంటే తండ్రి రోజూ ఏడుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే గోపి.. నా కొడుకుని చంపిన మానే శివతో పాటు మరో నలుగురిని వదిలిపెట్టేది లేదంటూ వారిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైన వారిని చంపి పగతీర్చుకోవాలని గోపి కంకణం కట్టున్నాడు.
ఇక ఇందులో భాగంగానే కొడుకుని చంపిన.. ఐదుగురిని చంపేందుకు గోపి భారీ స్కెచ్ వేసి కత్తులు నూరాడు. అయితే ఇందు కోసం గోపి.. తన స్నేహితుడైన మన్నే ప్రకాష్ సాయంతో మానే శివతో పాటు మరో నలుగురిని చంపేందుకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఈ నెల 16న జిల్లాలోని సుభాష్ నగర్ చౌరస్తాలో మానే శివను చంపేందుకు గోపి, మన్నే ప్రకాష్ మానే శివపై కత్తులతో దాడి చేశారు. వీరి దాడి నుంచి మానే శివ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న మానే శివ కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మానే శివ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్థానిక పోలీసులను ఆశ్రయింంచి ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 19 మానే శివను చంపాలని చూసిన చాట్ల గోపి, మన్నె ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.