పైన ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు శ్రీకాంత్. వయసు 19 ఏళ్లు. పెరిగి పెద్దవాడైన కుమారుడిని అతని తల్లిదండ్రులు గొప్ప గొప్ప చదువులు చదివిస్తున్నారు. ఇక కొడుకు ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి స్థాయిలో ఉంటాడని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆశపడ్డారు. అలా తల్లిదండ్రుల కోరికను నెరవేర్చేందుకు ఆ యువకుడు కూడా బాగానే కష్టపడి చదువుతున్నాడు. అయితే గత మూడు నెలల కిందట శ్రీకాంత్ కాలేజ్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. మూడు నెలల నుంచి తల్లిదండ్రులు వెతికి వెతికి అలసి పోయి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా మూడు నెలల తర్వాత కొడుకు అలా కనిపించడంతో అతని తల్లి తట్టుకోలేకపోయింది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
నిజామాబాద్ జిల్లా భోదన్ మండలం ఖండ్ గ్రామంలో లో శ్రీకాంత్ అనే యువకుడు తల్లిదండ్రులలో పాటు నివాసం ఉంటున్నాడు. ఇక చిన్నప్పటి నుంచి కొడుకుని అమ్మానాన్నలు చాలా గారాబంగా పెంచి పెద్ద చేశారు. కొడుకును ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ స్థానికంగా ఉండే ఓ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాడు. రోజూ కాలేజ్ కి వెళ్లి వస్తూ ఉండేవాడు. అలా కాలేజ్ లో చదువుకునే సమయంలో ఇతను ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మూడు నెలల కిందట శ్రీకాంత్ కాలేజ్ కు వెళ్తాన్నని ఇంట్లో చెప్పి వెళ్లాడు.
ఆ రోజు సాయంత్రం అయినా కుమారుడు ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుడ్డ ఆ యువకుడి తల్లిదండ్రులు బంధువులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అతడి ఆచూకు గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయినా శ్రీకాంత్ ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలో అర్థంకాని శ్రీకాంత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు నెలల నుంచి గాలిస్తూనే ఉన్నారు. పోలీసులకు కూడా అతని ఆచూకి దొరకలేదు. కట్ చేస్తే మూడు నెలల తర్వాత బోధన్ ప్రాంతంలో శ్రీకాంత్ శవమై కనిపించాడు.
ఈ విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాలేజ్ కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన కొడుకు చివరికి ఇలా శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే శ్రీకాంత్ ను ఎవరైనా హత్య చేశారా? లేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? అనే నిజాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే శ్రీకాంత్ మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.