సమాజం ఎటు పోతుందో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పడుతుంది. పెళ్లైన కొందరు మహిళలు శారీరక కోరికలు తీర్చుకునేందుకు ఎవరూ అడ్డొచ్చిన కూడా అడ్డు తొలగించుకుంటున్నారు. ఇటీవల తన పడక సుఖానికి అడ్డొస్తున్నాడని ఓ తల్లిని తన మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన ఘటన మరువక ముందే తాజాగా మారో దారుణం వెలుగులోకి వచ్చింది. తన తన సుఖానికి కూతురు అడ్డుగా ఉందని ఓ తల్లి ప్రియుడితో కలిసి కూతురుని దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా నిజమాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ పరిధిలోని భవానీపురానికి చెందిన దుర్గాభవాని, గురునాథం భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జీవనోపాధి కోసం ఈ దంపతులు గతంలో నిర్మల్ కు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. భర్త స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఈ క్రమంలోనే బాన్సువాడ కొల్లూరు చెందిన దుండగుల శ్రీను అనే వ్యక్తి దుర్గాభవానికి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం చివరికి వివాహేతర సంబంధంగా ఏర్పడింది. దీంతో కొన్నాళ్ల పాటు భార్య ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసేది. అయితే ఈ దంపతులు గతంలో నిర్మల్ నుంచి భవానీపురానికి వెళ్లిపోయారు. కొన్నాళ్ల నుంచి అక్కడే పని చేసుకుంటూ ఉంటున్నారు.
ఇదిలా ఉంటే దుర్గాభవాని గత నెల 14న బంధువుల ఇంటికి వెళ్లివస్తానని భర్తకు చెప్పి తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని వెళ్లింది. రెండు రోజులు అయినా భార్య తిరిగి రాకపోవడంతో ఖంగారుపడి బంధువులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నాడు. మా వద్దకి రాలేదని చెప్పడంతో భర్త ఖంగుతిన్నాడు. ఏం చేయాలో అర్థం కాక భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా భార్య నిర్మల్ లో ఉందని పోలీసులు గుర్తించారు. భర్తతో పాటు నిర్మల్ చేరుకున్న పోలీసులు భార్య ప్రియుడితో పాటు ఉండడంతో భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇక భర్త పెద్ద కుమార్తె ఏదని భార్యను ప్రశ్నించగా గొంతు నులిమి చంపేసి అడవిలో పడేశానని తెలిపింది.
అనంతరం ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు భవానీతో పాటు ఘటన స్థలానికి వెళ్లగా ఆమె కుమార్తె శవం కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ సీన్ ను చూసిన భర్త ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు అనంతరం భవానితో పాటు ఆమె ప్రియుడు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.