ఈరోజుల్లో యువతీయువకులు ప్రేమ పేరుతో దగ్గరవ్వటం.. సినిమాలు, షికార్లు పేరిట సరదాగా తిరగటం కామన్ అయిపోయింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి ఎక్కడ నలుగురికి తెలుస్తుందన్న భయంతో పరిస్థితి చేయిదాటకముందే వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం కూడా కామన్. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ప్రేమ పేరుతో దగ్గరవుతున్న యువతీయువకులు హద్దులు మీరుతుండడంతో.. పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్లిన కూతురు నిర్వాకం చూసి తల్లిదండ్రులు తలపట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన సినిమా స్టోరీకి మించి తలపిస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్లోని మహారాజ్గంజ్ కి చెందిన ఓక వ్యక్తి, గ్రామానికి చెందిన ఓ బంధువు ద్వారా పొరుగు జిల్లాకు చెందిన యువతిని నెలన్నర కిందట వివాహం చేసుకున్నాడు. అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడుకున్న తర్వాతే ఈ పెళ్లి జరిగింది. అయితే.. పెళ్ళైన నెలన్నరకు కోడలు కడుపులో నొప్పిగా ఉందంటూ అత్తింటివారికి చెప్పడంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె 4 నెలల గర్భవతి అని తేల్చారు. ఈ విషయం తెలియగానే భర్త ఆమెను అక్కడే వదిలేయడమే కాకుండా.. పరువు పోయిందంటూ భార్య తల్లిదండ్రుల వద్ద కూర్చొని బోరున ఏడ్చాడు. అంతేకాదు.. తన భార్య, ఆమె తల్లిదండ్రులు తనను మోసం చేశారంటూ పోలీసులను సైతం ఆశ్రయించాడు.
ఇది కూడా చదవండి: Ranga Reddy: ప్రేమిస్తున్నానని ఒకరు, స్నేహమంటూ మరొకరు.. సమయం దొరికితే చాలు దూరిపోయి!
అమ్మాయి గర్భం దాల్చిన విషయం ఆమె తల్లిదండ్రులను ముందే తెలుసునని.. నిజం దాచిపెట్టి తనను మోసం చేశారని వరుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పొలిసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.