ఈ మద్య కాలంలో వివాహబంధాలు ఒక్క ఏడాది కూడా కొనసాగడం లేదు.. ఇష్టం లేని పెళ్లి.. ఆర్థిక పరిస్థితులు, వివాహేతర సంబంధాలు.. కారణాలే ఏవమైనా పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నారు.
వివాహం అనేది జీవితంలో ఓ మరుపురాని కల. అలాంటిది కొంతమంది ఇష్టం లేని వివాహాలు చేసుకొని కొద్దిరోజుల్లోనే విడాకులు తీసుకుంటున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని భార్యాభర్తలు నరకం అనుభవించి.. ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఓ యువతికి తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో అత్తింటివారిని దారుణంగా మోసం చేసిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ భరత్పూర్లోని మధుర గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల క్రితం పెళ్లైన నవ వధువు అత్తమామలకు మత్తు తినిపించి ఇంటి నుండి పారిపోయింది. సమాచారం అందుకున్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించగా, అపస్మారక స్థితిలో ఉన్న అత్తమామలను ఆర్బీఎం ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని కిషన్పురలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణ అనే యువకుడికి సుమన్ అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత సుమన్ తన అత్తమామల ఇంట్లో నివసిస్తోంది. శనివారం రాత్రి సుమన్ భోజనంలో మందు కలిపి భర్త కృష్ణ, బావలు అయిన కాళీచరణ్, రాంవీర్, కోడలు జల్దీలకు తినిపించింది. అది తిన్న తర్వాత అందరూ స్పృహతప్పి పడిపోవడంతో సుమన్ ఇంట్లో నుంచి పారిపోయింది.
ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వధువు తండ్రి కృష్ణ పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసి కూతురితో మాట్లాడాలని కోరగా.. ఓ మహిళ ఇంట్లోకి వచ్చి చూడటంతో అందరూ అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించింది.. అప్పటికే కొందరికి వాంతులు కాగా మరికొందరు నొప్పితో విలపిస్తున్నారు. ఆ మహిళ ఈ సమాచారాన్ని వధువు తండ్రికి అందించి, చుట్టుపక్కల వారికి కూడా చెప్పింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మధుర గేట్ పోలీస్ స్టేషన్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలందరినీ 108 అంబులెన్స్ ద్వారా ఆర్బిఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
మరోవైపు సుమన్ కోసం ఇరుగుపొరుగు వారు, పోలీసులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పథకం ప్రకారమే.. సుమన్ ఇంట్లోని సభ్యులందరికీ కూరగాయల్లో మత్తు తినిపించి ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయి ఉంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలవడంతో సుమన్ తన వెంట తీసుకెళ్లిన వస్తువులన్నీ ఇంకా తెలియరాలేదు. పోలీసుల సమాచారంతో ఎఫ్ఎస్ఎల్ బృందం పాత్రల్లో ఉంచిన కూరగాయలతోపాటు ఇతర శాంపిల్స్ను కూడా సేకరించిందని, విచారణ తర్వాత పరిస్థితి పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని సుమన్ కోసం కూడా పోలీసు బృందం వెతుకుతున్నామని పోలీసులు అధికారు తెలిపారు.