నేటి కాలంలో భర్తల వేధింపులకు గురై అనేక మంది వివాహితలు ఊహించని నిర్ణయాలు తీసుకుటున్నారు. క్షణికావేశంలో తొందర పాటు నిర్ణయాలతో ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణాలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇలా ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా అక్రమ సంబంధాల ఉచ్చులో పడి పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా భర్త వేధింపులు భరించలేని ఓ భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్వాల్ లోని పాత నేరేడ్మెట్కు చెందిన స్రవంతి, సురేష్ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి పదేళ్ల కిందట ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే ఏడాది నుంచి పిల్లలతో పాటు భార్యాభర్తలు వినాయక్నగర్లో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Cyber Cheater: వీడు మామూలోడు కాదు.. ఏకంగా 250 మంది అమ్మాలను మోసం చేసి 8 కోట్లు దోచాడు!
అయితే కొంత కాలం బాగానే సాగిన వీరి దాంపత్య జీవితంలో కొన్నాళ్ల నుంచి గొడవలు మొదలయ్యాయి. మద్యానికి బానిసైన భర్త రోజూ తాగొచ్చి భార్య స్రవంతితో గొడవకు దిగేవాడు. ఇక ఒక రోజు రెండు రోజులు కాకుండా ప్రతీ రోజు వేధింపులకు గురిచేసేవాడని తెలుస్తోంది. ఇదే విషయంపై అనేక సార్లు పెద్ద పంచాయితిలో నచ్చజెప్పినా భర్త తీరు మాత్రం మారలేదు. ఇక భర్త వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతుండడంతో స్రవంతి భరించలేకపోయింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఈ నెల 11న స్రవంతి అర్ధరాత్రి నిద్ర లేచి ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వెంటనే స్పందించి చూసే సరికి స్రవంతి అప్పటికే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న స్రవంతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.