నూతన దంపతులకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో వరుడు వధువు మెడలో తాళికట్టాడు. బాజాబజంత్రీల నడుమ చుట్టాలంతా నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక అత్తారింట్లోకి కొత్త కోడలు వచ్చిందని అత్తింటివాళ్లు సైతం సంబరపడిపోయారు. ఇక పెళ్లైన మరుసటి రోజు తెల్లవారుజామున వాకింగ్ వెళ్తానని చెప్పి వెళ్లిన వరుడు చివరికి శవమై కనిపించాడు. తాజాగా నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన పెళ్లింట తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లాని వెలుగోడు మండలంలోని బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్ కు జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురనికి చెందిన చెందిన శిరీష అనే యువతితో శుక్రవారం వివాహమైంది. అయితే శనివారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్నానని వరుడి ఇంట్లో నుంచి వెళ్లాడు. ఉదయం సమయం పది కావస్తున్న వరుడు ఇంటికి ఇంకా రాకపోవడంతో బంధువులంతా ఖంగారుపడ్డారు. ఇక అటు ఇటు వెతికే క్రమంలోనే బోయరేవుల-మోత్కూరు రోడ్డుపై శివకుమార్ అనుమానాస్పద స్థితిలో చలనం లేకుండా పడి ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Khammam: చూస్తుంటే అమాయకురాలిలా ఉన్నావ్..! మరీ ఇంత దిగజారావా తల్లి?
ఈ విషయం తెలుసుకున్న వరుడి తల్లిదండ్రులు, బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మరణించాడని నిర్ధారించారు. ఈ వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. పెళ్లై ఓ రోజు కాకుండానే వరుడు మరణించడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై వరుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. శివ కుమార్ మరణంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన పెళ్లింటి తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.