యువతి, యువకుడు నచ్చుకున్నారు. ఇరువురి పెద్దలు పెళ్లికి నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు. ఇక ముందుగానే అమ్మాయి తరుపు బంధువులు కట్నం కింద రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక నెలరోజుల్లో పెళ్లి. కట్ చేస్తే కాబోయే భర్త వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య అంటూ వార్త. తాజాగావెలుగు చూసిన ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పంగవానికుంట తండాకు చెందిన మెగావత్ వెంకటేశ్వర్లు కుమార్తె నవత. కూతురికి పెళ్లి చేయాలనుకుని భావించి త్రిపురాం మండలం తండాకు చెందిన జగపతి బాబుతో పెద్దలు వివాహం నిశ్చయం చేశారు. యువతి యువకుడు కూడా నచ్చుకున్నారు. పెళ్లిలో తంతులో భాగంగా ఇక కట్నం కింద రూ. 20 లక్షల ఇవ్వాలంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Chennai: వేర్వేరుగా జీవిస్తున్న తల్లిదండ్రులు.. ఇకనైన కలవండంటూ కుమారుడు బలవన్మరణం!
అయితే కట్నం ఇచ్చే సమయంలో ఇరువురు కుటుంబాలు కట్నానికి బదులు సాగర్ రోడ్ లో ప్లాట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ వరుడు మాత్రం ప్లాట్ వద్దని కట్నమే కావాలంటూ పట్టుబట్టాడు. ఇక ముహుర్తం కూడా పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కాబోయే భర్తతో నవత ఫోన్ లో మాట్లాడుతుండేది. అయిత జగపతి బాబు కూడా మాట్లాడుతూ నాకు ప్లాట్ వద్దని, కట్నం కావాలంటూ కాబోయే భర్తకు చెప్పాడు.
ఇక ఇంతటితో ఆగకుండా ప్రతీ రోజుకు కాబోయే భార్య ను ఈ విషయంలో వేధింపులకు గురి చేసేవాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవత సోమవారం తెల్లవారు జామున ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.