ఇతని పేరు లింగస్వామి. వయసు 24 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తిన చేసిన ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేదే ఇతని కల. దీని కోసం పుస్తకాలతో కుస్తి పట్టి చివరికి ఆ యువకుడు చిన్న వయసులోనే తాను కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. అలా తన జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలోనే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కూడా ఇతని ప్రేమను అంగీకరించింది. అలా కొంత కాలం పాటు వీరిద్దరి ప్రేమాయణం కొనసాగింది. ఇక చివరికి ఇరువురి పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కట్ చేస్తే లింగుస్వామి హత్యకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం. ఇదే గ్రామంలో లింగుస్వామి అనే 24 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అలా అతని జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలోనే అతడు స్థానికంగా ఉండే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అతని ప్రేమకు అంగీకరించింది. దీంతో అలా వీరి ప్రేమాయణం కొంత కాలం వరకు కొన సాగింది. అయితే ఆ యువతి ప్రేమ విషయం ఇటీవల వారి ఇంట్లో తెలిసింది. దీంతో వారి పెద్దలు ఆ అమ్మాయిని బెదిరించడంతో పాటు లింగుస్వామికి కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా వెనక్కి తగ్గని లింగుస్వామి తన ప్రియురాలితో మాట్లాడుతూ ఉండేవాడు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి 11 గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లింగుస్వామిని నమ్మించి ఓ చోటుకు రమ్మన్నారు.
వారి మాటలు నమ్మి లింగుస్వామి అక్కడికి వెళ్లాడు. అనంతరం అతనిపై కొందరు దుండుగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో లింగుస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న లింగుస్వామి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే లింగుస్వామి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.