అది ముంబై పరిధిలోని ఓ ప్రాంతం. ఓ దంపతులకు పెళ్లై చాలా కాలమే అవుతుంది. భర్త వ్యాపారంలో బిజీగా మారి పైసా పైసా కూడబెడుతూ ఆర్థికంగా బలంగా తయ్యారయ్యాడు. ఇక భార్య అడిగిందల్లా కాదనకుండా కొనిస్తూ సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇలా ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి సంసారంలో గొడవలు మొదలై ఎట్టకేలకు భార్య అసలు రూపం బయట పడింది. కంత్రీ పెళ్లాం అని తెలుసుకున్న భర్త ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబై థానే పరిధిలోని సబర్బన్ మలాడ్ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై చాలా కాలం అవుతుంది. భర్త వ్యాపారంలో కాస్త బిజీగా మారి పైసా పైసా కూడబెడుతున్నాడు. అయితే తన భార్య అడిగిందల్లా కాదనకుండా భర్త అన్నీ కొనిస్తున్నాడు. నా భార్య దేవత అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ భార్య గురించి నలుగురికి గొప్పలు చెప్పేవాడు. కానీ కొన్ని రోజులు గడిచాక భర్తకు ఫ్యూజుల్ అవుట్ అయ్యే వార్త తెలిసింది. ఏంటంటే? తన భార్య మరో మగాడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని.
భర్త అమాయకుడు కావడంతో భార్య మారుతుందని వదిలేసేవాడు. అయినా భార్య తన తీరు మాత్రం మార్చుకోలేదు. ఇదే విషయంపై భర్త తన భార్యకు పద్దతి మార్చుకోవాలంటూ అనేక సార్లు చెప్పి చూశాడు. భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా, భర్త ముందే ప్రియుడితో బరితెగించి తిరిగేది. ఈ కంత్రీ పెళ్లాం చేసే పనులకు భర్త విసిగిపోయాడు. ఇటీవల ఓ రోజు భర్త తన భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ భర్త మాటను భార్య అస్సలు లెక్కచేయకుండా అతనిపైకి ఎదురు తిరిగి మాట్లాడింది.
ఇదే కాక ఇటీవల భార్య అర్థరాత్రిగా పూట ఇంటికి రావడంతో భర్త భార్యను ప్రశ్నించాడు. నేను ఎప్పుడు వస్తే నీకేంటి అంటూ బరితెగించి మాట్లాడింది. ఇక్కడే భర్తకు ఎక్కడ లేని కోపం కట్టలు తెంచుకుంది. నీలాంటి కంత్రీ పెళ్లాం ఉన్నా లేకున్నా ఒకటే అనుకున్న భర్త ఇంట్లో ఉన్న కత్తితో భార్యను పొడిచి చంపాడు. అనంతరం భర్త పోలీసులు ఎదుట లొంగిపోయి.. నా భార్యను నేనే చంపానంటూ ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అమాయకపు భర్తపై విర్రవీగి ప్రవర్తించిన ఇలాంటి కంత్రీ పెళ్లాంను లేకుండా చేసిన భర్త తీరు కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.