MIM Bholakpur Corporator Arrest: పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్ తాహాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ట్వీట్తో రంగంలోకి దిగిన పోలీసులు గౌస్ను బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, భోలక్పూర్ కార్పొరేటర్ అయిన గౌస్ రెండు రోజుల క్రితం పాట్రోలింగ్కు వచ్చిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. అర్థరాత్రి పూట దుకాణాలు మూసేయాలన్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. దుకాణాలు మూసే ప్రసక్తే లేదని, తన ఇలాఖాలో ఇలానే ఉంటుందని అన్నాడు. ఎస్ఐతోనే మాట్లాడతానంటూ కానిస్టేబుళ్లతో దుర్భాషలాడాడు.
మరో 30 రోజుల వరకు తన ప్రాంతంలో అడుగుపెట్టొద్దని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్కు ట్విటర్లో ట్యాగ్ చేశారు. పోలీసులతో తప్పుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనపై కేటీఆర్ స్పందించారు. డీజీపీని ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ట్వీట్ చేసిన 24 గంటల లోపే కార్పొరేటర్ను అరెస్ట్ చేశారు. అయితే, అంతకు క్రితం బీజేపీ ఎమ్మెల్యే దీనిపై డీజీపీకి ట్విటర్లో ట్యాగ్ చేశారు. దానికి ఎలాంటి స్పందన రాలేదు. తాజా పరిణామంపై మరోసారి ఆయన స్పందించారు. కేటీఆర్ స్పందిస్తే తప్ప పోలీసులు చర్యలు తీసుకోరా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty
No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2
— KTR (@KTRTRS) April 6, 2022
ఇవి కూడా చదవండి : విర్రవీగిన 60 ఏళ్ల వృద్ధుడు.. ఒంటరిగా ఉన్న బాలుడిని ఏం చేశాడో తెలుసా?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.