సోమవారం ఉదయం రమదేవి పరీక్ష హాలులో తోటి విద్యార్థులతో ఎగ్జామ్ రాస్తుంది. ఇదే సమయంలో ఇన్విజిలేటర్ రమాదేవి వద్దకు వచ్చి.. అలా వేధించినట్లు తెలుస్తుంది. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురై..
సోమవారం ఉదయం పరీక్ష హాలులో విద్యార్థులంతా ఎగ్జామ్ రాస్తున్నారు. వీరితో పాటు రమాదేవి అనే విద్యార్థి కూడా పరీక్ష రాస్తుంది. అయితే ఇదే సమయంలో ఇన్విజిలేటర్ ఆ యువతి వద్దకు వచ్చి అందరి ముందు అలా చేయడంతో రమాదేవి తట్టుకోలేకపోయింది. ఇక నా పరువు మొత్తం పోయిందని భావించిన ఆ యవతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇదే ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలోని కర్నూలు జిల్లా బల్మూరు చెంచుగూడ గ్రామానికి చెందిన రమాదేవి (17) మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. రమాదేవి చదువుకుంటూ ఇక్కడే హాస్టల్ లో ఉంటుంది. అయితే సోమవారం కాలేజీ యాజమాన్యం ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించింది. ఇందులో భాగంగానే రమాదేవి పరీక్ష హాలులో తోటి విద్యార్థులతో ఎగ్జామ్ రాస్తుంది. ఇదే సమయంలో ఇన్విజిలేటర్ రమాదవి వద్దకు వచ్చి.. కాలేజీ ఫీజు చెల్లించాలంటూ వేధించినట్లు తెలుస్తుంది.
ఇక పరీక్ష హాలులోనే అందరి ముందు టీచర్ అలా వేధించడంతో రమాదేవి తట్టుకోలేకపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి.. ఎగ్జామ్ పూర్తైన వెంటనే నేరుగా హాస్టల్ లోని తన గదిలోకి వెళ్లి రమాదేవి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తోటి విదార్థులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో కాలేజీ యాజమాన్యం ఆ గదిలోకి వెళ్లి ఉరివేసుకున్న రమాదేవిని పరీశీలించారు. అనంతరం ఇదే విషయంపై పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు తెలియజేశారు. కూతురి మరణవార్త తెలుసుకున్న రమాదేవి తల్లిదండ్రులు.. వెంటనే హాస్టల్ కు చేరుకుని కూతురిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. గత వారం రోజుల నుంచి కాలేజీ యాజమాన్యం ఫీజు చెల్లించాలని మా కూతురుని, మమ్మల్ని అనేక రకాలుగా వేధిస్తున్నారని రమాదేవి తండ్రి ఆరోపించారు.
మా కూతురి మరణానికి కారణమైన ఈ కాలేజీ యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు. విద్యార్థి సంఘాలు, స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం స్థానిక విద్యార్థి సంఘాలు ఆ కాలేజీ ముందు ధర్నా నిర్వహించాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.