పూజల పేరుతో ఈ అయ్యగారు అందమైన మహిళలను కన్నేశాడు. వారికి ఎన్నో మాయమాటలు చెప్పి.. తన కోరికలు తీర్చుకున్నాడు. ఇంతటితో ఆగకుండా మరో దారుణానికి పాల్పడ్డాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఓ పూజారి రాసలీలలు గుట్టురట్టైంది. దైవ దర్శనానికి వచ్చిన ఎంతో మంది అమాయక మహిళలపై కన్నేస్తూ దారుణానికి పాల్పడ్డాడు. ఇంతటితో ఆగని ఈ మాయగాడు.. వారిని మోసం చేస్తూ చివరికి శారీరకంగా కోరికలు తీర్చుకున్నాడు. ఇక ఇతగాడి మాయలో ఇప్పటికీ ఎంతోమంది బలయ్యారు. అయితే ఈ పూజారి లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో ఆస్ బెస్టాస్ కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో వెల్పూరి రాములు అనే వ్యక్తి గత కొంత కాలంగా పూజారిగా పని చేస్తున్నాడు. అయితే ఈ ఆలయానికి స్థానిక మహిళలు దైవ దర్శనానికి ఆంజనేయస్వామి గుడికి వస్తూ ఉండేవారు. అలా వస్తూ ఉండే మహిళలపై ఈ దుర్మార్గపు పూజారి కన్నేసేవాడు. ఇక మాయ మాటలతో అమాయకపు మహిళలను నమ్మించేవాడు. దీంతో పాటు ఈ కేటుగాడు ఆ మహిళలతో శారీరక కోరికలు తీర్చుకున్నాడు.
ఇక ఇంతటితో ఆగకుండా.. వారి ఆస్తులు దోచుకుకునేందుకు కూడా కుట్ర చేసినట్లు సమచారం. అచ్చం ఇలాగే ఓ మహిళను నమ్మించి మోసం చేయడంతో ఆ మహిళ తట్టుకోలేకపోయింది. దీంతో ఈ నీచపు పూజారి లీలలపై బాధిత మహిళ తాజాగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పూజల పేరుతో మహిళలను శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసిన ఇలాంటి నీచుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.