మహారాష్ట్రాలో దారుణం చోటు చేసుకుంది. కనిపెంచిన ఓ తల్లి కసాయిగా మారింది. ఏకంగా తన ఆరుగురు పిల్లలను చెరువలో తోసి చంపేసి దారుణ చర్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే. అది మహారాష్ట్రాలోని రాయ్గఢ్ జిల్లాలో ఓ ప్రాంతం. ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడుతో పాటు ఐదుగురు కుమార్తెలు జన్మించారు.
కొంతకాలం బాగానే సాగిన వీరి దాంపత్య జీవితంలో రోజులు గడిచే కొద్ది మనస్పర్ధలు వచ్చి చేరాయి. దీంతో అత్తింటి వేధింపులు కూడా ఆ వివాహితకు ఎదురైనట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే భర్త కుటుంబ సభ్యులు ఆ వివాహితను హింసిస్తూ కొట్టేవారట. దీనిని ఆ వివాహిత సహించలేకపోయింది. ఎన్నో అవమానాలు భరిస్తూ సంసారాన్ని ముందుకు నడిపించినా అత్తింటి వాళ్ల వేధింపులు మాత్రం ఆగలేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి.
ఇది కూడా చదవండి: Siddipet: ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరో యువతిని లేపుకెళ్లిన ప్రియుడు!
ఇక ఈ తరుణంలోనే ఆ మహిళకు ఓ విషపు ఆలోచన తట్టింది. కనిపెంచిన కూతుళ్లను, కొడుకును చంపాలనే ఆలోచనకు వచ్చింది. అనుకున్నదే ఆలస్యం అటువైపుగా ప్రయత్నాలు కూడా చేసింది. ముంబైకి 100కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకాలోని ఖరవలి గ్రామంలోని ఓ బావి వద్దకు ఆ మహిళ తన కూతుళ్లతో పాటు కుమారుడిని కూడా తీసుకెళ్లింది. ఎవరు లేని సమయం చూసుకుని తన ఆరుగురు పిల్లలను ఆ బావిలో తోసేసి దారుణంగా చంపేసింది.
ఇక చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల మధ్య వయసు వారే ఉండటం విశేషం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులువిచారణ చేపడుతున్నారు. పోలీసుల విచారణలో భాగంగా ఆ మహిళపై భర్త కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారని ఈ కారణంతోనే ఆ వివాహిత ఇంతటి దారుణానికి ఒడికట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.