ఓ భార్యను వేధించిన భర్తపై పగ తీర్చుకంది ఓ భార్య. ఏకంగా అతని ప్రైవేట్ పార్ట్ పైనే దాడి చేయడంతో పాటు బండరాయితో తలపై మోది దారుణంగా హత్యకు పాల్పడింది. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఏం జరిగిందంటే? మహారాష్ట్రలోని కొల్హాపూర్ పరిధిలోని శాహువాడీలోని లోలనే ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన ప్రకాష్ పాండురంగ కాంట్లే, వందన ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గతంలో పెళ్లైంది.
ఇక కొంత కాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ భర్త తాగుడుకు బానిసై ఇంటికి రోజు తాగి వచ్చేవాడు. దీంతో పాటు నీకు ఎవరితో వివాహేతర సంబంధాలు ఉన్నాంటూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. దీంతో ప్రతీ రోజు మద్యం తాగి రావడం, భార్యపై అనుమానంతో వేధించడమే పనిగా పెట్టుకున్నాడు భర్త. ఇక రోజు రోజుకు భర్త ప్రకాష్ పాండురంగ కాంట్లే వేధింపులు ఎక్కువవ్వడంతో సర్దుకుపోదామనే ఆలోచనకు కూడా వచ్చింది.
ఇది కూడా చదవండి: Chennai: భర్తపై కోపం.. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసిన భార్య!
కానీ భర్త మాత్రం అస్సలు తగ్గదే లే అంటూ రోజులు గడుస్తున్న కొద్ది అనుమానంతో వేధించేవాడు. ఇక ఇన్నాళ్లు మౌనంగా ఉన్న భార్య వందన ఇక తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సోమవారం భర్త తాగి వచ్చాడు. ఆ రోజు కూడా వేధింపులకు గురి చేశాడు. ఇక భార్య వందన కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే పక్కనే ఉన్న బండరాయితో భర్త తలపై గట్టిగా బాదింది. ఇంతటితో ఆగకుండా అతని ప్రైవేట్ పార్ట్ పై కూడా దారుణంగా దాడి చేసి చివరికి భర్తను హతమర్చింది.
ఇక వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య వందనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.