కనిపెంచిన పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కొందరు తల్లిదండ్రులు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. మూడ నమ్మకాల మైకం పడి కన్న పిల్లలను సైతం లెక్కచేయడం లేదు. ఇలా ఇప్పటికీ ఎంతో మంది అమాయకులు మూడ నమ్మకాలకు బలై ఆస్తులతో పాటు అనారోగ్య పాలవుతున్నారు. ఇలా మూడ నమ్మకాలకు బలైన ఓ తల్లిదండ్రులు కన్న కూతురి ప్రాణాలను చేజేతులా తీసుకున్నారు. ఇటీవల మహారాష్ట్రలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగ్ పూర్ లోని సిద్ధార్థ్ చిమ్నె(45), రంజన(42) అనే వ్యక్తులు 5,16 ఇద్దరు కూతుళ్లను తీసుకుని ఓ బాబా వద్దకు వెళ్లారు. అక్కడి వెళ్లిన తర్వాత మా కూతురు ప్రవర్తనలో మార్పు వచ్చిందని, క్షుద్రపూజలు చేయాలని ఆ బాబాను వేడుకున్నారు. డబ్బుకు ఆశపడ్డ ఆ బాబా తల్లిదండ్రుల కోరినట్టే సరే అన్నాడు. ఇక క్షుద్రపూజలలో భాగంగా ఆ తల్లిదండ్రులు 5 ఏళ్ల కూతురిని విచక్షణ రహింతగా కొట్టారు. అలా వారి దెబ్బలను భరించలేక ఆ 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులతో పాటు ఆ బాబాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. క్షుద్ర పూజల నెపంతో కన్న కూతురు ప్రాణం పోయేలా కొట్టి హత్య చేసిన ఈ తల్లిదండ్రుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.