ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత చైతన్యం కల్పిస్తున్నా కూడా రోడ్డు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదంలో ఒకరి ప్రాణం పోయింది అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడ్డట్లే. అతి వేగం, నిర్లక్ష్యం.. కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. తాజాగా పెళ్లికి బయల్దేరిన ఓ కుటుంబం మార్గం మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజాముల 5.30 గంటల సమయంలో కారు, డీసీఎం ఢీకొన్నాయి. ప్రమాదం కూడా ఎంతో భీకరంగా జరగడంతో అక్కడికక్కడే ఆరుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. కారు కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. స్థానికుల అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు, సహాయకబృందాలు మృతదేహాలను వెలికి తీశారు. క్రేన్ సాయంతో కారును, డీసీఎంలను వేరు చేసి తరలించారు. పూణెకి పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.