మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. అత్తింట్లో అడుగు పెట్టిన కోడలికి ఆరేళ్లు అవుతున్నా పిల్లలు కలగలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అత్తమామలు కోడలి ముఖంపై సలసల మరిగే వేడి నూనేను పోశారు. తాజాగా వార్తల్లోకి ఎక్కిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రతాప్ బంజార అనే వ్యక్తికి గత ఆరేళ్ల కిందట ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది.
కానీ పెళ్లై 6 సంవత్సరాలు గడుస్తున్నా ఈ దంపతులకు ఇంకా పిల్లలు కలగ లేదు. ఇన్నేళ్లు అయిన భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో భర్తతో పాటు ఆమె అత్తమామలు వెసిగి చెందారు. నలుగురిలోకి వెళ్లాలంటేనే ఏదో విధంగా ఫీలవుతున్నారు. కోడలికి పిల్లలు పుట్టకపోవడంతో ఊళ్లో జనాలంతా సూటిపోటి మాటలతో నిందిస్తున్నారు. ఇక ఇదే విషయమై భర్తతో పాటు అత్తమామలు కూడా ఆ మహిళను శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి చేసేవారు. వీరి వేధింపులను ఆ మహిళ తట్టుకోలేకపోయింది.
ఇది కూడా చదవండి: డబ్బుల కోసం భార్యను స్నేహితుల పక్కలోకి పంపిన భర్త!
అయితే ఇటీవల ఓ రోజు ఆ మహిళ నిద్రిస్తుండగా సలసల మరిగే వేడి నూనేను భర్తతో పాటు అత్తమామలు కోడలు ముఖంపై పోశారు. ఈ దాడిలో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కోడలికి పిల్లలు కలగలేదని భర్తతో పాటు అత్తమామలు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.