కొన్ని రాష్ట్రాలకు మద్యం మంచి ఆదాయవనరుగా మారింది. గతకొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ మద్య రాష్ట్రాలకు ఆదాయం తీసుకు వస్తున్నప్పటికీ కుటుంబాల్లో మాత్రం కలకలం రేపుతున్నాయి.
దేశ వ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయని చెబుతుంటారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో మద్యం విక్రయం భారీగా పెరిగిపోయాయి. వాణిజ్య పన్నుల రాబడుల తర్వాత ఎక్కువ ఆదాయం వస్తున్నది అబ్కారీ శాక నుంచే వస్తుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే మద్యం ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం వస్తున్నాయి.. కానీ మద్యం భూతం ఎన్నో కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. మద్యం రేపిన కలకలం 24 గంటల్లో భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల మద్యం మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న బెల్టు షాపులు పేద ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. మద్యానికి బానిసైన వాళ్లు కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం.. అప్పుల పాలు చేయడంతో ఎంతోమంది రోడ్డున పడుతున్నారు. బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఓ కుటుంబలో మద్యం మహమ్మారి చిచ్చు పెట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానకీపురం గ్రామానికి చెందిన కోల అఖిల(21), వెంకటేశ్వరరావు(28) దంపతులు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో భార్యాభర్తలు పనులు చేసేవారు. భార్య కూలీ పనులు చేస్తుండగా.. భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు.
గత కొంతకాలంగా వెంకటేశ్వరరావు మద్యానికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. దీంతో భార్యాభర్తల మద్య తరుచూ గొడవలు రావడం మొదలయ్యాయి. మద్యం మత్తులో వెంకటేశ్వరరావు భార్య అఖిలను తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ వచ్చాడు. దీంతో జీవితంపై విసుగు చెందిన అఖిల మంగళవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అది చూసి వెంకటేశ్వరరావు భయంతో అదే రోజు పురుగుల మందు తాగాడు.. అది గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వీరి పిల్లలు నరేంద్రబాబు(3), అక్షిత్ కుమార్(1) అనాథలుగా మిగిలారు. చిన్నారులను దీన పరిస్థితి చూసి గ్రామస్థులు కంటతడిపెట్టారు.