కోడలిపై పెత్తనం చెలాయించాలనే అత్త ఇంట్లో ఉన్నన్ని రోజులు కోడలు కుక్కిన పేనులా ఉండాల్సిందేనా.. అంటూ కొందరు కోడళ్లు బరితెగిస్తున్నారు. ఇలా ఉండడం ఇష్టం లేని కొందరు కోడళ్లు అత్తపై నోరు జారుతు పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇంతటితో ఆగకుండా ఆస్తి, అంతస్తుల కోసం అత్తపై దాడికి కూడా పాల్పడేందుకు వెనకాడడం లేదు. ఇలాగే బరితెగించిన ఓ కోడలు ఆస్తి కోసం ఏకంగా అత్తను ఉరేసి చంపేసింది. ఇటీవల కృష్ణ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అది కృష్ణా జిల్లా పెడన. ఇదే ప్రాంతంలో అత్త రజని, కోడలు కొండాలమ్మ మధ్య ఆస్తి కోసం గత కొంత కాలం నుంచి తరుచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు కుటుంబ సభ్యులు తలదూర్చి అనేక సార్లు వారిద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంత కాలం బాగానే ఉన్న ఆ అత్తాకోడళ్లు ఇటీవల మరోసారి గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కోడలు కోపం కట్టలు తెంచుకుంది. అయితే కోడలు అత్త తలపై బలంగా కొట్టడంతో అత్త స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. అప్పటికి కోడలు కోపం చల్లారకపోవడంతో అత్తకు చీరతో ఉరేసింది. ఆ తర్వాత అత్త ప్రమాదవశాత్తు కిందపడిపోయిందని భర్తకు ఫోన్ చేసి చెప్పింది.
వెంటనే స్పందించిన భర్త హుటాహుటిన తల్లిని ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ రజని రెండవ రోజు మరణించింది. కాగా పోస్ట్ మార్టం నిర్వహించగా.. రజనిది సాధారణ మరణం కాదని, ఉరేసి హత్య చేశారంటూ రిపోర్ట్ లో వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా కోడలు కొండాలమ్మపై అనుమానం రావడంతో గట్టిగా విచారించారు.
ఇక నేనే అత్తను చంపేశాను అని కోడలు ఒప్పుకోవడంతో భర్తతో పాటు బంధువులంతా షాక్ కు గురయ్యారు. అనంతరం కోడలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అస్తి కోసం సొంత అత్తను ఉరేసి చంపిన ఈ కోడలి తీరుపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.