ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం,శుభం తెలియని ఓ 9వ తరగతి విద్యార్థినికి ఆ గ్రామ కుల పెద్దలు తల్లిదండ్రులకు తెలియకుండా బలవంతంగా పెళ్లి చేశారు. ఆ తర్వాత కట్టుకున్న వాడితోనే సంసారం చేయాలంటూ కాపురానికి సాగనంపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అది ముదిగొండ మండలం గంధసిరి. ఇదే గ్రామానికి చెందిన ఉప్పలరాజు, బోజమ్మ దంపతులు. వీరికి 16 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. అయితే ఈ భార్యాభర్తల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ఆ గ్రామ కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. ఇక్కడ కూడా వీరి గొడవల పరిష్కారానికి మార్గం దొరకలేదు. దీంతో చివరికి ఈ దంపతులు కోర్టు ద్వారా విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని కుల పెద్దలు జీర్ణించుకోలేకపోయారు.
ఇది కూడా చదవండి: వీడో నీచమైన ప్రబుద్దుడు.. ప్రేమ జంటలే టార్గెట్ గా చేసుకుని!
దీంతో ఈ దంపతులపై ఉన్న పగను వారి కుమార్తెపై తీర్చుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే వారి కుమార్తెకు తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా కుల పెద్దలు ఓ యువకుడితో బలవంతంగా వివాహం జరిపించారు. ఇక అతనితోనే కాపురం చేయాలంటూ సాగనంపారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు ప్రతీ రోజూ ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఈ బాలిక తండ్రి కుల పెద్దల నిర్ణయంపై ఒంటికాలుపై లేచాడు. కనీసం.. సమాచారం ఇవ్వకుండా మీరు ఎలా పెళ్లి చేస్తారని నిలదీశాడు.
ఇక ఆ బాలిక తండ్రి అప్పలరాజు ఈ కుల పెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 18 మంది కులపెద్దలను, మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నందుకు ఆ యువకుడిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. తల్లిదండ్రులపై ఉన్న పగతో అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలికకు పెళ్లి చేసిన కుల పెద్దల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.