ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తున్న ఈ యువతి ఎప్పటిలాగే మంగళవారం నైట్ డ్యూటీకి వెళ్లింది. కానీ, మరుసటి రోజు ఆమె చేసిన పనికి ఆ యువతి తల్లిదండ్రులు షాకయ్యారు. అసలేం జరిగిందంటే?
ఈ యువతి పేరు కావ్య. వయసు 19 ఏళ్లు. ఖమ్మం పారమెడికల్ కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. అయితే, కాలేజీ ఇంటికి దూరంగా ఉండడంతో దగ్గరలోనే ఓ ఇంట్లో అద్దెకు దిగింది. అక్కడే ఉంటూ కాలేజీకి వెళ్లేది. అలా కొన్ని రోజులు గడిచింది. బాగా చదివి వైద్య వృత్తిలో స్థిరపడాలని ఎన్నో కలలు కనింది. ఇకపోతే, నవ్య ఎప్పటిలాగే మంగళవారం రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లొచ్చింది. ఇక బుధవారం ఉదయం నిద్రపోయింది. కట్ చేస్తే.. నవ్య చివరికి ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంతకు నవ్య చేసిన పనేంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామం. ఇక్కడే కావ్య (19) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ చదువుకుంది. ఇక వైద్య వృత్తిలో కొనసాగాలనే ఉద్దేశంతో ఏఎన్ఎం చదువుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఖమ్మంలోని ఓ కాలేజీలో నర్సింగ్ లో చేరింది. కాలేజీ ఇంటికి దూరంగా ఉండడంతో తన స్నేహితురాలితో కలిసి ఖమ్మంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది. నవ్య కాలేజీకి వెళ్తూనే ఆస్పత్రిలో నర్సుగా కూడా పని చేసేది. అయితే, నవ్య ఎప్పటిలాగే మంగళవారం రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లి వచ్చింది. బుధవారం ఉదయం నిద్రపోయింది.
అయితే ఏం జరిగిందో ఏం తెలియదు కానీ, బుధవారం మధ్యాహ్నం తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఓ గంట తర్వాత స్నేహితురాలి వచ్చి చూడగా.. నవ్య అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే ఆ యువతి నవ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న మృతురాలి తల్లి.. కూతురుని అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం నవ్య తల్లి స్థానిక ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు నవ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? అందుకు దారి పరిస్థితులు ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.