ప్రొద్దుటూరు ఈశ్వర్రెడ్డి నగర్లో కిషోర్ అనేవ్యక్తి ఇంట్లో మృతదేహం లభ్యమైంది. తన స్నేహితుడైన సతీష్ను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు కిషోర్. ఈ విషయం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ మధ్యకాలంలో హత్యలు చేయడం మంచినీళ్లు తాగినంత సులభమైపోయింది. పర్యవసానాలు ఆలోచించకుండా హత్యలు చేస్తున్నారు. చిన్న చిన్న గొడవలకు పోయి తమ విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. తాగిన మైకంలో ఏం చేసేది కూడా తెలియనంతగా ప్రవర్తిస్తున్నారు. స్నేహితులతో కలిసి మెలిసి ఉన్నంత వరకు బాగానే ఉంటారు. తేడా వచ్చిందంటే ప్రాణాలను లెక్కచేయకుండా చంపేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే కడప జిల్లాలో నెలకొంది. కిషోర్ అనేవ్యక్తి ఇంట్లో మృతదేహం లభ్యమైంది. తన స్నేహితుడైన సతీష్ను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు కిషోర్. గత నెల రోజులుగా స్నేహితుని శవంతో సహజీవనం చేశాడు. కిషోర్ తల్లి వచ్చి ఆరాతీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డి నగర్లో జయ కిషోర్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతను రోజువారి కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు. తన స్నేహితుడైన సతీష్ ఇంట్లో భార్యతో గొడవపడి కిషోర్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించి కిషోర్ ఇంట్లోనే పడుకునేవారు. కిషోర్ ఇంట్లో రోజులాగే స్నేహితులిద్దరూ మద్యం సేవించారు. మద్యం సేవించిన సతీష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో కిషోర్ భయంతో తన ఇంట్లోనే శవం పైన ఇసుక మట్టిని పోసి కప్పి ఉంచాడు. గత నెల రోజులుగా పక్కనే పడుకుని సహజీవనం చేశాడు.
కిషోర్ తల్లి లక్ష్మీదేవి హైదరాబాదు నుండి వితంతు పింఛన్ కోసం వచ్చింది. కిషోర్ ఇంట్లో దుర్వాసన రావడంతో అనుమానంతో కిషోర్ని ప్రశ్నించింది. శవం పైన ఇసుక మట్టి కప్పి ఉండడం చూసి.. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కిషోర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో సతీష్ను హత్య చేసి ఇంట్లో పూడ్చి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.