ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం.. డిప్రేషన్ లోకి వెళ్లిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్ కి గురై క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడం.. లేదా ఎదుటి వారిపై దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు, పని వత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఇలా కారణాలు ఏవైనా.. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతూ కన్నవారిని కన్నీటి సంద్రంలో ముంచేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తు మంచి భవిష్యత్ తో జీవితం కొనసాగించాల్సిన ఓ మహిళ పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకున్న ఘటన శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని సౌందర్య(33) అదే ప్రాంతానికి చెందిన ఇంజనీర్ అభినవ్ తో ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ మద్యనే దంపతులు హైదరాబాద్ కి షిఫ్ట్ అయి కొండాపూర్ లో ఉంటున్నారు.
ఈ నెల 8న సౌందర్య ఆఫీస్ కి బయలుదేరింది. శంషాబాద్ లో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు 100 కి సమాచారం అందించారు.. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి అప్పటికే సౌందర్య భవనంపై నుంచి దూకింది.. తీవ్రంగా గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సౌందర్య తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.